నిజామాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం తిరుమలపల్లి గ్రామానికి చెందిన కృష్ణ, అజయ్ అనే ఇద్దరు యువకులు నగరంలో పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో కృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అజయ్కు తీవ్రగాయాలయ్యాయి.
విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ద్విచక్రవాహనం... ఒకరు మృతి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
![విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ద్విచక్రవాహనం... ఒకరు మృతి Bike Accident at Nizamabad, one Person died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7988216-1005-7988216-1594478878821.jpg?imwidth=3840)
గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అజయ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నిజామాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం తిరుమలపల్లి గ్రామానికి చెందిన కృష్ణ, అజయ్ అనే ఇద్దరు యువకులు నగరంలో పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో కృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అజయ్కు తీవ్రగాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అజయ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.