నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్యూటీ డాక్టర్ లేకపోవడం వల్ల ఓ మహిళకు నర్సు పురుడు పోయగా.. వైద్యం వికటించి శిశువు మృతి చెందింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
డ్యూటీ డాక్టర్ లేకపోవడం వల్ల ఏఎన్ఎం నర్సు మాధవి అనే మహిళకు సాధారణ డెలివరీ చేసింది. ఆ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల నవజాత శిశువు ఉమ్మనీరు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి.. కొద్దిసేపటికి ప్రాణాలు విడిచింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: వరదల నుంచి కోలుకోకముందే హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం