ETV Bharat / state

'నిజామాబాద్​ నుంచి కామారెడ్డిలోకి ఎవ్వరూ రావొద్దు' - డీఎస్పీ దామోదర్​ రెడ్డి

వైరస్​ నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా నిజామాబాద్​ నుంచి కామారెడ్డి జిల్లాకు రాకపోకలను పోలీసులు బంద్ చేశారు. నిజామాబాద్​లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున ఈ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు డీఎస్పీ దామోదర్​ రెడ్డి తెలిపారు.

all-roads-on-nizamabad-to-kamareddy-were-closed-by-the-police
'నిజామాబాద్​ నుంచి కామారెడ్డిలోకి ఎవ్వరూ రావొద్దు'
author img

By

Published : Apr 8, 2020, 8:27 PM IST

కరోనా వైరస్ నివారణ కోసం కామారెడ్డి జిల్లా బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్, బోధన్ నుంచి వచ్చే వాహనాలు కామారెడ్డి జిల్లాలోనికి రాకుండా చుట్టూ ఉన్న రహదారులను మూసివేశారు. నసురుల్లాబాద్ మండలం కామారెడ్డి జిల్లా సరిహద్దులోని మార్గం ద్వారా రాకపోకలు బంద్ చేశారు.

నిజామాబాద్​లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం వల్ల ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు చెక్​పోస్ట్​ను ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఈ చెక్​పోస్ట్ లాక్​డౌన్ ఎత్తివేసేవరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం వల్ల..ఎట్టి పరిస్థితుల్లోనూ కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించరాదని అని ఆయన వెల్లడించారు.

కరోనా వైరస్ నివారణ కోసం కామారెడ్డి జిల్లా బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్, బోధన్ నుంచి వచ్చే వాహనాలు కామారెడ్డి జిల్లాలోనికి రాకుండా చుట్టూ ఉన్న రహదారులను మూసివేశారు. నసురుల్లాబాద్ మండలం కామారెడ్డి జిల్లా సరిహద్దులోని మార్గం ద్వారా రాకపోకలు బంద్ చేశారు.

నిజామాబాద్​లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం వల్ల ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు చెక్​పోస్ట్​ను ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఈ చెక్​పోస్ట్ లాక్​డౌన్ ఎత్తివేసేవరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం వల్ల..ఎట్టి పరిస్థితుల్లోనూ కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించరాదని అని ఆయన వెల్లడించారు.

ఇవీచూడండి: ఆరు నెలల బిడ్డకు అమ్మగా.. బాధ్యతగల ఉద్యోగిగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.