ETV Bharat / state

ట్రాక్టర్​ను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి - latest news on accident at balkonda nizamabad district one person dead

కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్​ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

accident at balkonda nizamabad district one person dead
ట్రాక్టర్​ను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి
author img

By

Published : Feb 27, 2020, 10:53 AM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న ఓ లారీ ట్రాక్టర్​ను వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో మోసిన్​ అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పసుపును ఉడకబెట్టడానికని కూలీలు ట్రాక్టర్‌లో బాల్కొండ శివార్లలోని కల్లం వద్దకు వెళ్తున్నారు. నిర్మల్‌ వైపు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ లారీ ట్రాక్టర్‌ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ప్రమాదంలో ట్రాలీలో కూర్చున్న మోసిన్‌ అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఘటనా స్థలానికి చేరుకున్న బాల్కొండ పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులనూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు, క్షతగాత్రులు మహారాష్ట్రలోని నాందేడ్​కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ట్రాక్టర్​ను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి

ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న ఓ లారీ ట్రాక్టర్​ను వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో మోసిన్​ అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పసుపును ఉడకబెట్టడానికని కూలీలు ట్రాక్టర్‌లో బాల్కొండ శివార్లలోని కల్లం వద్దకు వెళ్తున్నారు. నిర్మల్‌ వైపు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ లారీ ట్రాక్టర్‌ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ప్రమాదంలో ట్రాలీలో కూర్చున్న మోసిన్‌ అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఘటనా స్థలానికి చేరుకున్న బాల్కొండ పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులనూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు, క్షతగాత్రులు మహారాష్ట్రలోని నాందేడ్​కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ట్రాక్టర్​ను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి

ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.