ETV Bharat / state

ఇంట్లో దుర్వాసన.. పరిశీలిస్తే రెండు మృతదేహాలు - నిర్మల్​ జిల్లా తాజా వార్తలు

ఒక ఇంట్లో నుంచి తీవ్రంగా దుర్వాసన వచ్చింది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం తెలిపారు. తీరా ఏం జరిగిందని పోలీసులు వచ్చి పరిశీలిస్తే... ఒకే ఇంట్లో తల్లి, కుమార్తెలు మరణించి విగత జీవులుగా పడిఉన్నారు. కరోనా కారణంగా మరణించి ఉంటారని అధికారులు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. ఈ ఘటన నిర్మల్​ జిల్లాలో జరిగింది.

ramtech village nirmal , two dead bodies found
ఇంట్లో దుర్వాసన.. పరిశీలిస్తే రెండు మృతదేహాలు
author img

By

Published : Apr 25, 2021, 10:27 PM IST

నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రాంటెక్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో తల్లి లక్ష్మీబాయి(70), కుమార్తె భారత్ బాయి(50) మృతి చెందారు. దీంతో ఆదివారం ఉదయం వారి ఇంట్లో నుంచి దుర్ఘంధం వస్తుందని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన మృత దేహాలను చూసి అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు.

తల్లి లక్ష్మీ బాయి(70), కుమార్తె భారత్ బాయి(50)లు నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఓ ఆర్​ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లి ట్రీట్​మెంట్​ తీసుకున్నట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. కరోనాతో మృతి చెందినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధణకు వచ్చారు. గ్రామస్థుల సాయంతో వారికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇదీ చూడండి : జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై తండ్రీకొడుకుల దాడి

నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రాంటెక్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో తల్లి లక్ష్మీబాయి(70), కుమార్తె భారత్ బాయి(50) మృతి చెందారు. దీంతో ఆదివారం ఉదయం వారి ఇంట్లో నుంచి దుర్ఘంధం వస్తుందని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన మృత దేహాలను చూసి అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు.

తల్లి లక్ష్మీ బాయి(70), కుమార్తె భారత్ బాయి(50)లు నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఓ ఆర్​ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లి ట్రీట్​మెంట్​ తీసుకున్నట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. కరోనాతో మృతి చెందినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధణకు వచ్చారు. గ్రామస్థుల సాయంతో వారికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇదీ చూడండి : జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై తండ్రీకొడుకుల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.