ETV Bharat / state

నిర్మల్ బస్ డిపోను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు

author img

By

Published : Nov 15, 2019, 4:00 PM IST

తమ సమస్యలు తీర్చాలని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు కార్మికులు బైఠాయించారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బస్సులు బయటకు రాకుండా నిర్మల్ డిపో ముందు కార్మికుల బైఠాయింపు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోను కార్మికులు ముట్టడించారు. ఉదయం ఆరు గంటలకే కార్మికులంతా డిపో వద్దకు చేరుకుని బస్సులు బయటికి వెళ్లకుండా గేట్ ముందే బైఠాయించారు. ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.
కార్మికులు లోపలికి వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని కార్మికులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపచేశారు. అక్కడి నుంచి కార్మికులు ర్యాలీగా నినాదాలు చేస్తూ సమ్మె శిబిరానికి చేరుకున్నారు.

బస్సులు బయటకు రాకుండా నిర్మల్ డిపో ముందు కార్మికుల బైఠాయింపు
ఇవీ చూడండి : ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోను కార్మికులు ముట్టడించారు. ఉదయం ఆరు గంటలకే కార్మికులంతా డిపో వద్దకు చేరుకుని బస్సులు బయటికి వెళ్లకుండా గేట్ ముందే బైఠాయించారు. ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.
కార్మికులు లోపలికి వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని కార్మికులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపచేశారు. అక్కడి నుంచి కార్మికులు ర్యాలీగా నినాదాలు చేస్తూ సమ్మె శిబిరానికి చేరుకున్నారు.

బస్సులు బయటకు రాకుండా నిర్మల్ డిపో ముందు కార్మికుల బైఠాయింపు
ఇవీ చూడండి : ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!
Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.