ETV Bharat / state

ప్రజల నుంచి ఆశించకుండా సేవాభావంతో పనిచేయాలి - The services should work without expecting from the public

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్మల్‌ జిల్లా కేంద్రంలో పోలీసులు 2కె రన్ నిర్వహించారు.

సేవలకు ప్రజల నుంచి ఆశించకుండా పనిచేయాలి
author img

By

Published : Oct 19, 2019, 6:40 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్​ స్టేడియం నుంచి మంచిర్యాల్ చౌరస్తా వరకు కళాశాల విద్యార్థులతో 2కె రన్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు హాజరై, జెండా ఊపి 2కె రన్​ను ప్రారంభించారు. అనంతరం శివాజి చౌక్‌లో విద్యార్థులు మానవహారం చేపట్టారు.

పోలీసుల అమరవీరుల త్యాగాల ఫలమే నేటి నిర్మల్ జిల్లాలో శాంతి స్థాపన జరిగిందని ఎస్పీ అన్నారు. పోలీసులు అందిస్తున్న సేవలకు ప్రజల నుంచి గుర్తింపు ఆశించకుండా పనిచేయాలన్నారు. అనునిత్యం ప్రజాసేవలో విధులు నిర్వర్తిస్తూ.. ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందనీ, వారి త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.

సేవలకు ప్రజల నుంచి ఆశించకుండా పనిచేయాలి

ఇదీ చూడండి : సెల్​టవర్ ఎక్కి ఆర్టీసీ కార్మికుల నిరసన

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్​ స్టేడియం నుంచి మంచిర్యాల్ చౌరస్తా వరకు కళాశాల విద్యార్థులతో 2కె రన్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు హాజరై, జెండా ఊపి 2కె రన్​ను ప్రారంభించారు. అనంతరం శివాజి చౌక్‌లో విద్యార్థులు మానవహారం చేపట్టారు.

పోలీసుల అమరవీరుల త్యాగాల ఫలమే నేటి నిర్మల్ జిల్లాలో శాంతి స్థాపన జరిగిందని ఎస్పీ అన్నారు. పోలీసులు అందిస్తున్న సేవలకు ప్రజల నుంచి గుర్తింపు ఆశించకుండా పనిచేయాలన్నారు. అనునిత్యం ప్రజాసేవలో విధులు నిర్వర్తిస్తూ.. ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందనీ, వారి త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.

సేవలకు ప్రజల నుంచి ఆశించకుండా పనిచేయాలి

ఇదీ చూడండి : సెల్​టవర్ ఎక్కి ఆర్టీసీ కార్మికుల నిరసన

Intro:TG_ADB_34_19_POLICE 2K RUN_AVB_TS10033
నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు..
శివాజి చౌక్‌లో విద్యార్థుల మానవహారం..
_____________________________________
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకోని నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఎన్‌.టి.ఆర్‌ మిని స్టేడియం నుండి మంచిర్యాల్ చౌరస్తా వరకు పోలీస్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల జ్ఞాపకార్థం చేపట్టిన ఈ 2K రన్‌ ఎస్పీ శ్రీ.సి.శశిధర్ రాజు ప్రారంభించారు. శివాజి చౌక్‌లో విద్యార్థులు మానవహారం చేపట్టారె.
ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసుల అమరవీరుల త్యాగాల ఫలమే నేటి నిర్మల్ జిల్లాలో శాంతి స్థాపన జరిగిందని పేర్కొన్నారు. పోలీసులు అందిస్తున్న సేవలకు ప్రజల నుండి గుర్తింపు ఆశించకుండా, పోలీసులు మాత్రం ప్రజల రక్షణ కోసం తమ విధులను నిరంతరం కోనసాగిస్తారని తెలిపారు.
బైట్‌..శశిధర్‌ రాజు, నిర్మల్‌ జిల్లా ఎస్పిBody:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్ ts 9390555843

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.