ETV Bharat / state

శ్రీరాం సాగర్​ భూ బాధితుల భూమి కబ్జాకు యత్నం

author img

By

Published : Jul 17, 2020, 10:01 PM IST

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పోచంపాడ్​ గ్రామం ముంపునకు గురైంది. బాధితులకు నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మండల కేంద్రంలో కొంత స్థలం కేటాయించగా కొత్త పోచంపాడ్ పేరిట పునరావాస గ్రామం ఏర్పడింది. 40 ఏళ్లకు పైగా ఆ గ్రామ ప్రజలు అక్కడే జీవిస్తున్నారు. అయితే.. గ్రామ అవసరాల కోసం ప్రభుత్వం గతంలో కేటాయించిన భూమిని ఇప్పుడు కొంతమంది అక్రమంగా సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Sriram sagar Project Lands Occupaid illegally
శ్రీరాంసాగర్​ భూబాధితుల భూమి కబ్జాకు యత్నం

నిర్మల్​ జిల్లాలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పోచంపాడ్​ అనే గ్రామం ముంపునకు గురైంది. ముంపు బాధితులకు నిర్మల్​ మండలంలో ప్రభుత్వం కొంత భూమి కేటాయించింది. నలభై ఏళ్లుగా పోచంపాడ్​ గ్రామ ప్రజలు అక్కడే నివసిస్తూ... వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే.. ప్రభుత్వం గ్రామ అవసరాలకు కేటాయించిన భూమిని కొంత మంది ఆక్రమణ దారులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం ఈ విషయమై పలుమార్లు కలిసినా.. స్పందించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని అనుకొని ఉన్న సుమారు 9 ఎకరాల స్థలాన్ని గ్రామానికి సంబంధం లేని వ్యక్తి పేరిట పట్టా చేయడంపై గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడే నష్టపోయినా...
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూమిని కోల్పోయిన ముంపు బాధితులకు ఇంటి స్థలం, సాగు చేసేందుకు కొత్త పోచంపాడ్ గ్రామంలో స్థలాన్ని కేటాయించారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కోల్పోయినంత భూమిని కాకుండా సగటు పద్ధతిన స్థలాలు కేటాయించి పట్టాలు చేసినట్లు గ్రామస్థులు చెప్తున్నారు. నిర్మాణ సమయంలోనే ఇళ్లు, పంటభూములు నష్టపోయి.. ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారంతో జీవనం సాగిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన భూమిని అక్రమంగా సొంతం చేసుకోవాలనుకోవడం అన్యాయమని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రాజెక్టు పరిహారం డబ్బులు ప్రభుత్వం ఇప్పటికీ అందించలేదని, గ్రామాభివృద్ధిని సైతం పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. ఉద్యోగం కల్పిస్తామన్న హామీ సైతం బుట్టదాఖలైందని, ఇవేవీ పట్టించుకోకుండా ఎవరికీ తెలియకుండా స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం ఇవ్వకుండానే..
స్థలాన్ని సర్వే చేసేముందు పక్కనుండే స్థల యజమానులకు సమాచారం ఇవ్వాలి. కానీ.. కొత్త పోచంపాడ్​ గ్రామం విషయంలో అది జరగలేదు. గ్రామానికి చెందిన స్థలం కాబట్టి కనీసం పంచాయతీలోనైనా సమాచారం అందించాలి. అభ్యంతరాలుంటే తెలియజేయాలంటూ నోటీసు ఏర్పాటు చేయాలి. ఇవేవీ చేయకుండానే స్థలం సర్వే పూర్తి చేసి హద్దులు చెప్పి పట్టా ప్రక్రియను ముగించారు. రెవెన్యూ అధికారులు, సర్వేయర్ల సహకారం లేకుండా ఇది జరగదు. కేవలం ఒకరిద్దరి ప్రయోజనం కోసం వందకు పైగా కుటుంబాలకు ఉపయోగపడే స్థలాన్ని ఎలా ఫణంగా పెడతారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా చూస్తాం.. చేస్తాం.. అంటూ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

నిర్మల్​ జిల్లాలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పోచంపాడ్​ అనే గ్రామం ముంపునకు గురైంది. ముంపు బాధితులకు నిర్మల్​ మండలంలో ప్రభుత్వం కొంత భూమి కేటాయించింది. నలభై ఏళ్లుగా పోచంపాడ్​ గ్రామ ప్రజలు అక్కడే నివసిస్తూ... వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే.. ప్రభుత్వం గ్రామ అవసరాలకు కేటాయించిన భూమిని కొంత మంది ఆక్రమణ దారులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం ఈ విషయమై పలుమార్లు కలిసినా.. స్పందించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని అనుకొని ఉన్న సుమారు 9 ఎకరాల స్థలాన్ని గ్రామానికి సంబంధం లేని వ్యక్తి పేరిట పట్టా చేయడంపై గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడే నష్టపోయినా...
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూమిని కోల్పోయిన ముంపు బాధితులకు ఇంటి స్థలం, సాగు చేసేందుకు కొత్త పోచంపాడ్ గ్రామంలో స్థలాన్ని కేటాయించారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కోల్పోయినంత భూమిని కాకుండా సగటు పద్ధతిన స్థలాలు కేటాయించి పట్టాలు చేసినట్లు గ్రామస్థులు చెప్తున్నారు. నిర్మాణ సమయంలోనే ఇళ్లు, పంటభూములు నష్టపోయి.. ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారంతో జీవనం సాగిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన భూమిని అక్రమంగా సొంతం చేసుకోవాలనుకోవడం అన్యాయమని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రాజెక్టు పరిహారం డబ్బులు ప్రభుత్వం ఇప్పటికీ అందించలేదని, గ్రామాభివృద్ధిని సైతం పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. ఉద్యోగం కల్పిస్తామన్న హామీ సైతం బుట్టదాఖలైందని, ఇవేవీ పట్టించుకోకుండా ఎవరికీ తెలియకుండా స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం ఇవ్వకుండానే..
స్థలాన్ని సర్వే చేసేముందు పక్కనుండే స్థల యజమానులకు సమాచారం ఇవ్వాలి. కానీ.. కొత్త పోచంపాడ్​ గ్రామం విషయంలో అది జరగలేదు. గ్రామానికి చెందిన స్థలం కాబట్టి కనీసం పంచాయతీలోనైనా సమాచారం అందించాలి. అభ్యంతరాలుంటే తెలియజేయాలంటూ నోటీసు ఏర్పాటు చేయాలి. ఇవేవీ చేయకుండానే స్థలం సర్వే పూర్తి చేసి హద్దులు చెప్పి పట్టా ప్రక్రియను ముగించారు. రెవెన్యూ అధికారులు, సర్వేయర్ల సహకారం లేకుండా ఇది జరగదు. కేవలం ఒకరిద్దరి ప్రయోజనం కోసం వందకు పైగా కుటుంబాలకు ఉపయోగపడే స్థలాన్ని ఎలా ఫణంగా పెడతారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా చూస్తాం.. చేస్తాం.. అంటూ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.