ETV Bharat / state

సమాచారం ఇవ్వకుండా కందుల కొనుగోళ్లు నిలిపివేత

భైంసా మార్కెట్​లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ కందుల కొనుగోళ్లు జరపాల్సి ఉన్నా ప్రారంభించలేదు. కొనుగోలు కేంద్రానికి తాళం వేసి ఉండటం వల్ల కొందరు రైతులు తిరిగి వెళ్లిపోయారు. మరికొందరు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Feb 18, 2020, 3:21 PM IST

సమాచారం ఇవ్వకుండా కందుల కొనుగోళ్లు నిలిపివేత
సమాచారం ఇవ్వకుండా కందుల కొనుగోళ్లు నిలిపివేత

నిర్మల్ జిల్లా భైంసాలోని మార్కెట్‌లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కందుల కొనుగోళ్లను అధికారులు నిలిపివేశారు. రైతులకు అధికారులు ఇవాళ్టీ తేదీతో టోకెన్ ఇవ్వడం వల్ల కందులను కొనుగోలు కేంద్రానికి వాహనాల్లో తీసుకువచ్చారు. కొనుగోలు కేంద్రానికి తాళం వేసి ఉండటాన్ని చూసి కొందరు రైతులు తిరిగివెళ్లిపోయారు.

అన్ని పనులు వదులుకొని ధాన్యాన్ని అమ్ముకుందామని వస్తే అధికారులు స్పందించట్లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సమాచారం అందుకున్న అధికారులు ఇవాళ కొనుగోళ్లు ప్రారంభించారు.

సమాచారం ఇవ్వకుండా కందుల కొనుగోళ్లు నిలిపివేత

ఇవీచూడండి: 'ఒక్కో ఎకరానికి 50లక్షల నష్ట పరిహారమివ్వాలి'

నిర్మల్ జిల్లా భైంసాలోని మార్కెట్‌లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కందుల కొనుగోళ్లను అధికారులు నిలిపివేశారు. రైతులకు అధికారులు ఇవాళ్టీ తేదీతో టోకెన్ ఇవ్వడం వల్ల కందులను కొనుగోలు కేంద్రానికి వాహనాల్లో తీసుకువచ్చారు. కొనుగోలు కేంద్రానికి తాళం వేసి ఉండటాన్ని చూసి కొందరు రైతులు తిరిగివెళ్లిపోయారు.

అన్ని పనులు వదులుకొని ధాన్యాన్ని అమ్ముకుందామని వస్తే అధికారులు స్పందించట్లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సమాచారం అందుకున్న అధికారులు ఇవాళ కొనుగోళ్లు ప్రారంభించారు.

సమాచారం ఇవ్వకుండా కందుల కొనుగోళ్లు నిలిపివేత

ఇవీచూడండి: 'ఒక్కో ఎకరానికి 50లక్షల నష్ట పరిహారమివ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.