నిర్మల్ జిల్లాలో రెండో విడత పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు జడ్పీటీసీ స్థానాలకు గాను 22 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... 49 ఎంపీటీసీ స్థానాలకు 146 మంది పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకై 296 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 35 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వేసవికాలం కావటం వల్ల ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, మంచినీటి సౌకర్యం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.
ఇవీ చూడండి: ఆదిలాబాద్ రిమ్స్కు ఎంసీఐ గుర్తింపు పునరుద్ధరణ