ETV Bharat / state

జిల్లావ్యాప్తంగా ప్రకృతి వనాలతో గ్రామాలకు కొత్త శోభ

author img

By

Published : Nov 4, 2020, 3:01 PM IST

నిర్మల్​ జిల్లా సోన్​ మండలంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను జడ్పీటీసీ జీవన్​రెడ్డి ప్రారంభించారు. ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతాయని ఆయన తెలిపారు.

palle prakruti vanam opened at son in nirmal district
జిల్లావ్యాప్తంగా ప్రకృతి వనాలతో గ్రామాలకు కొత్త శోభ

గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని నిర్మల్​ జిల్లా సోన్​ జడ్పీటీసీ జీవన్​రెడ్డి అన్నారు. మండలంలోని పాక్​పట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతాయని జీవన్​రెడ్డి తెలిపారు.

నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉషారాణి, ఎంపీవో అశోక్​, సర్పంచ్​ గంగారెడ్డి, ఉపసర్పంచ్​ మహేశ్​, ఎంపీటీసీ మల్కవ్వ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని నిర్మల్​ జిల్లా సోన్​ జడ్పీటీసీ జీవన్​రెడ్డి అన్నారు. మండలంలోని పాక్​పట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతాయని జీవన్​రెడ్డి తెలిపారు.

నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉషారాణి, ఎంపీవో అశోక్​, సర్పంచ్​ గంగారెడ్డి, ఉపసర్పంచ్​ మహేశ్​, ఎంపీటీసీ మల్కవ్వ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండిః అడవిపందుల నియంత్రణపై కసరత్తు... వెర్మిన్​ జాబితాలో చేర్చే యోచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.