నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో రాయితీ కింద రైతులకు పంపిణీ చేసిన సోయా విత్తనాలు మొలకెత్తలేదు. ఫలితంగా రైతులు ఆందోళన చేపట్టారు. స్పందించిన వ్యవసాయశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ముధోల్లోని పంటలను పరిశీలించారు.
రాయితీ కింద పంపిణీ చేసిన సోయా విత్తనాలు మొలకెత్తలేదని గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని రైతులకు భరోసా కల్పించారు.
ఇదీచూడండి: 'మీకు స్థలాలు ఎవరిచ్చారు? కౌన్సిలర్ భర్త బెదిరింపులు'