ETV Bharat / state

పాఠశాల అభివృద్ధికి తెరాస నేత విరాళం - donation to school

సొంత గ్రామంపై ఉన్న మమకారంతో ఆ పాఠశాల దుస్థితి అతనిని కలిచివేసింది. తాను చదువుకున్న పాఠశాలకు తనవంతుగా సాయం చేయాలనుకున్నాడు. శిథిలావస్థలో ఉన్న భవన మరమ్మతులకు తనకు తొచినంత విరాళమిచ్చి నిర్మల్​ తెరాస జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్​ దాతృత్వం చాటాడు.

తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తెరాస నాయకుని విరాళం
తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తెరాస నాయకుని విరాళం
author img

By

Published : Jul 7, 2020, 4:29 PM IST

నిర్మల్ జిల్లా పెంబి మండల ప్రభుత్వ పాఠశాల మరమ్మతులు, అభివృద్ధి కోసం తెరాస జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్ లక్షన్నర విరాళంగా ఇచ్చారు. చెక్కును గ్రామ సర్పంచ్ పూర్ణ చందర్ గౌడ్​కు అందజేశారు. 10 రోజుల క్రితం యాబై వేలు ఇవ్వగా... మరింత అభివృద్ధి కోసం లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

తాను చుదువుకున్న పాఠశాల శిథిలావస్థలో ఉన్నందున తనకు తోచినంత సాయం చేయాలనే ఉద్దేశంతో విరాళం ఇచ్చినట్టు రాంచందర్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు కుర్మా రాజేందర్, ఉప సర్పంచ్ స్వప్నిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

నిర్మల్ జిల్లా పెంబి మండల ప్రభుత్వ పాఠశాల మరమ్మతులు, అభివృద్ధి కోసం తెరాస జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్ లక్షన్నర విరాళంగా ఇచ్చారు. చెక్కును గ్రామ సర్పంచ్ పూర్ణ చందర్ గౌడ్​కు అందజేశారు. 10 రోజుల క్రితం యాబై వేలు ఇవ్వగా... మరింత అభివృద్ధి కోసం లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

తాను చుదువుకున్న పాఠశాల శిథిలావస్థలో ఉన్నందున తనకు తోచినంత సాయం చేయాలనే ఉద్దేశంతో విరాళం ఇచ్చినట్టు రాంచందర్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు కుర్మా రాజేందర్, ఉప సర్పంచ్ స్వప్నిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.