ETV Bharat / state

రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

author img

By

Published : May 13, 2021, 3:24 PM IST

నిర్మల్​ జిల్లా కేంద్రంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి పర్యటించారు. జిల్లా కేంద్రంలోని గాజులపేట్​ నుంచి ఆలూర్​ వరకు రూ.4కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న డబుల్​ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

indrakaran reddy
నిర్మల్ వార్తలు

నిర్మల్​ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలోని గాజుల పేట్​ చౌరస్తా నుంచి లంగ్డాపూర్​, వెంగ్వాపేట్​ మీదుగా ఆలూర్​ వరకు నిర్మించనున్న డబుల్​ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. మొదటగా డ్రైనేజీ పనులు పూర్తి చేసి రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

అనంతరం రాంరావ్​బాగ్​లోని జౌళి నాల పూడికతీత పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్ సీఎస్ ఛైర్మన్ ధర్మాజీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్​ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలోని గాజుల పేట్​ చౌరస్తా నుంచి లంగ్డాపూర్​, వెంగ్వాపేట్​ మీదుగా ఆలూర్​ వరకు నిర్మించనున్న డబుల్​ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. మొదటగా డ్రైనేజీ పనులు పూర్తి చేసి రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

అనంతరం రాంరావ్​బాగ్​లోని జౌళి నాల పూడికతీత పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్ సీఎస్ ఛైర్మన్ ధర్మాజీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి; రాష్ట్రంలో పటిష్టంగా అమలవుతున్న లాక్‌డౌన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.