ETV Bharat / state

'ఇండియా ఫ్లాగ్​ చూసి వదిలిపెట్టారు.. ప్రధాని మోదీకి థ్యాంక్స్​..'

author img

By

Published : Mar 4, 2022, 4:41 PM IST

Students Came from Ukrain: "ఉక్రెయిన్​లో మేమున్నా ప్రాంతం నుంచి మన జాతీయ జెండాను పట్టుకుని బయలుదేరాం. సరిహద్దుల్లో మన జెండాను చూసి.. వదిలిపెట్టారు. ఎంతో గర్వంగా అనిపించింది. అందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు." .. ఉక్రెయిన్ నుంచి భారత్​కు సురక్షితంగా వచ్చిన ఈ విద్యార్థిని రియాక్షన్ ఇది.

medicine student alekhya came to home twon kuntala from Ukraine
medicine student alekhya came to home twon kuntala from Ukraine

Students Came from Ukrain: యుద్ధభూమి ఉక్రెయిన్​ నుంచి మరో తెలంగాణ విద్యార్థి సురక్షితంగా తన స్వగ్రామానికి చేరుకుంది. నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన చేపూరి అలేఖ్య.. గురువారం(మార్చి 3న) రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకుంది. తల్లిదండ్రులు పురుషోత్తం, శశికళ మధ్యాహ్నమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అలేఖ్యను రిసీవ్​ చేసుకున్నారు. యుద్ధం మొదలైన పది రోజుల అనంతరం.. ఎన్నో మలుపుల తర్వాత ఎట్టకేలకు స్వదేశానికి వచ్చిన అలేఖ్యను చూసి తల్లిందండ్రులు, సన్నిహితులు ఉద్వేగానికి లోనయ్యారు. నిన్న రాత్రి హైదరాబాద్​ చేరుకున్న అలేఖ్య.. ఈరోజు ఉదయం స్వగ్రామానికి చేరుకున్నారు.

బంకర్​లో తలదాచుకున్నాం..

స్వగ్రామానికి చేరుకున్న అలేఖ్యను.. నిర్మల్ జిల్లా భాజపా అధ్యక్షురాలు రమాదేవి పలకరించారు. వారితో పాటు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అలేఖ్యను కలిసి కుశలం అడిగారు. వారం రోజుల నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుండడంతో తాన తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలిపారు. తాను ఉంటున్న ప్రాంతంలో బాంబులు పడుతుండడంతో.. హాస్టల్ కింద ఉన్న బంకర్​లో తలదాచుకున్నామని.. తాము పడిన బాధలను వివరించారు. తమను క్షేమంగా ఇంటికి వచ్చేలా చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఎంతో గర్వంగా అనిపించింది..

"మెడిసిన్​ కోసం 5 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లాను. నాలుగున్నరేళ్ల పాటు చదువు ప్రశాంతంగా కొనసాగింది. అనుకోకుండా యుద్ధం మొదలైంది. మేం ఉంటున్న ప్రాంతంలోనూ బాంబులు పడ్డాయి. హస్టల్​ కింద ఉన్న బంకర్​లో రెండు రోజుల పాటు ఉన్నాం. ఆ తరువాత ఎంబసీ సూచన మేరకు ఇండియా జెండాలు పట్టుకుని రుమేనియా వరకు చేరుకున్నాం. అక్కడ రెండు రోజులు ఉన్నాం. నిన్న యుద్ధ విమానంలో దిల్లీకి చేరుకుని.. అక్కడి నుంచి రాత్రి హైదరాబాద్​కు వచ్చి.. ఉదయానికి ఇంటికి వచ్చేశాం. ఉక్రెయిన్​లో తాము ఉన్న ప్రాంతం నుంచి బయలు దేరినప్పుడు సరిహద్దులో భారతదేశ జెండాను చూసి వదిలిపెట్టారు. అప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు." - అలేఖ్య, మెడిసిన్​ విద్యార్థిని

తమ కూతురిని సురక్షితంగా దేశానికి తీసుకురావడానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్​లో మన దేశ జెండా చూసి వదిలిపెట్టడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

'సరిహద్దుల్లో ఇండియా ఫ్లాగ్​ చూసి వదిలిపెట్టారు.. ప్రధాని మోదీకి థ్యాంక్స్​..'

ఇదీ చూడండి:

Students Came from Ukrain: యుద్ధభూమి ఉక్రెయిన్​ నుంచి మరో తెలంగాణ విద్యార్థి సురక్షితంగా తన స్వగ్రామానికి చేరుకుంది. నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన చేపూరి అలేఖ్య.. గురువారం(మార్చి 3న) రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకుంది. తల్లిదండ్రులు పురుషోత్తం, శశికళ మధ్యాహ్నమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అలేఖ్యను రిసీవ్​ చేసుకున్నారు. యుద్ధం మొదలైన పది రోజుల అనంతరం.. ఎన్నో మలుపుల తర్వాత ఎట్టకేలకు స్వదేశానికి వచ్చిన అలేఖ్యను చూసి తల్లిందండ్రులు, సన్నిహితులు ఉద్వేగానికి లోనయ్యారు. నిన్న రాత్రి హైదరాబాద్​ చేరుకున్న అలేఖ్య.. ఈరోజు ఉదయం స్వగ్రామానికి చేరుకున్నారు.

బంకర్​లో తలదాచుకున్నాం..

స్వగ్రామానికి చేరుకున్న అలేఖ్యను.. నిర్మల్ జిల్లా భాజపా అధ్యక్షురాలు రమాదేవి పలకరించారు. వారితో పాటు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అలేఖ్యను కలిసి కుశలం అడిగారు. వారం రోజుల నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుండడంతో తాన తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలిపారు. తాను ఉంటున్న ప్రాంతంలో బాంబులు పడుతుండడంతో.. హాస్టల్ కింద ఉన్న బంకర్​లో తలదాచుకున్నామని.. తాము పడిన బాధలను వివరించారు. తమను క్షేమంగా ఇంటికి వచ్చేలా చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఎంతో గర్వంగా అనిపించింది..

"మెడిసిన్​ కోసం 5 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లాను. నాలుగున్నరేళ్ల పాటు చదువు ప్రశాంతంగా కొనసాగింది. అనుకోకుండా యుద్ధం మొదలైంది. మేం ఉంటున్న ప్రాంతంలోనూ బాంబులు పడ్డాయి. హస్టల్​ కింద ఉన్న బంకర్​లో రెండు రోజుల పాటు ఉన్నాం. ఆ తరువాత ఎంబసీ సూచన మేరకు ఇండియా జెండాలు పట్టుకుని రుమేనియా వరకు చేరుకున్నాం. అక్కడ రెండు రోజులు ఉన్నాం. నిన్న యుద్ధ విమానంలో దిల్లీకి చేరుకుని.. అక్కడి నుంచి రాత్రి హైదరాబాద్​కు వచ్చి.. ఉదయానికి ఇంటికి వచ్చేశాం. ఉక్రెయిన్​లో తాము ఉన్న ప్రాంతం నుంచి బయలు దేరినప్పుడు సరిహద్దులో భారతదేశ జెండాను చూసి వదిలిపెట్టారు. అప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు." - అలేఖ్య, మెడిసిన్​ విద్యార్థిని

తమ కూతురిని సురక్షితంగా దేశానికి తీసుకురావడానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్​లో మన దేశ జెండా చూసి వదిలిపెట్టడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

'సరిహద్దుల్లో ఇండియా ఫ్లాగ్​ చూసి వదిలిపెట్టారు.. ప్రధాని మోదీకి థ్యాంక్స్​..'

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.