మొదటి రోజు కొవిడ్ టీకాను 30 మంది వైద్యసిబ్బందికి వేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి టీకాను పీహెచ్సీలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధర్ తీసుకున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తొలిసారి వైద్యసిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండో రోజు కూడా నిబంధనల పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సిద్ధప్ప, పార్వతి, రాజ్యలక్ష్మి, శరణ్య, తిరుపతి, వైద్యసిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కరోనాకు చరమగీతం పాడేందుకే వాక్సిన్: సబితా ఇంద్రారెడ్డి