ETV Bharat / state

మక్తల్​ ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సిన్​ పంపిణీ - మక్తల్​ కొవిడ్ వ్యాక్సిన్​ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే రామ్మోహన్​ రెడ్డి

నారాయణపేట జిల్లా మక్తల్​ ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్​ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్​ రెడ్డి ప్రారంభించారు. మొదటిరోజు 30 మంది వైద్యసిబ్బందికి కరోనా టీకాను వేశారు. తొలి వ్యాక్సిన్​ను పీహెచ్​సీలో పనిచేస్తున్న ల్యాబ్​ టెక్నీషియన్​ శ్రీధర్​ తీసుకున్నారు.

Vaccine distribution at Maktal Government Hospital started by mla ram mohan reddy  in narayanpet district
టీకా ఇస్తున్న వైద్యసిబ్బంది
author img

By

Published : Jan 16, 2021, 4:57 PM IST

మొదటి రోజు కొవిడ్​ టీకాను 30 మంది వైద్యసిబ్బందికి వేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో శాసనసభ్యులు రామ్మోహన్​ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి టీకాను పీహెచ్​సీలో పనిచేస్తున్న ల్యాబ్​ టెక్నీషియన్​ శ్రీధర్​ తీసుకున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తొలిసారి వైద్యసిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్​ పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండో రోజు కూడా నిబంధనల పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సిద్ధప్ప, పార్వతి, రాజ్యలక్ష్మి, శరణ్య, తిరుపతి, వైద్యసిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : కరోనాకు చరమగీతం పాడేందుకే వాక్సిన్: సబితా ఇంద్రారెడ్డి

మొదటి రోజు కొవిడ్​ టీకాను 30 మంది వైద్యసిబ్బందికి వేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో శాసనసభ్యులు రామ్మోహన్​ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి టీకాను పీహెచ్​సీలో పనిచేస్తున్న ల్యాబ్​ టెక్నీషియన్​ శ్రీధర్​ తీసుకున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తొలిసారి వైద్యసిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్​ పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండో రోజు కూడా నిబంధనల పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సిద్ధప్ప, పార్వతి, రాజ్యలక్ష్మి, శరణ్య, తిరుపతి, వైద్యసిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : కరోనాకు చరమగీతం పాడేందుకే వాక్సిన్: సబితా ఇంద్రారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.