నారాయణపేట జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 125 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి తీసుకుని కర్ణాటక వెళుతుండగా... టాస్క్ ఫోర్స్ మాటువేసి పట్టుకున్నారు.
జిల్లా సరిహద్దుల్లో వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు. అప్పిరెడ్డిపల్లికి చెందిన మల్లయ్య కేసు నమోదు చేశారు. నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని అమ్మినా, అక్రమ రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.