నారాయణపేట జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గ్రీన్ కమిటీ సమావేశంలో పాలనాధికారి హరి చందన పాల్గొన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 65 లక్షల 20 వేల మొక్కలు నాటేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. అలాగే మున్సిపాలిటీలో పెద్దమొత్తంలో మొక్కలను నాటి పచ్చదనం పెంచాలని వెల్లడించారు.
గ్రామాల్లోని పాఠశాలల్లో కూడా మొక్కలు నాటేవిధంగా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం తెలంగాణకు హరితహారం పోస్టర్ను విడుదల చేశారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి గంగారెడ్డి నారాయణ రావు, డీఆర్డీఓ కాళిందిని, డీఈఓ రవీందర్ పాల్గొన్నారు.