ETV Bharat / state

మట్టి దిబ్బ కూలి పది మంది మృతి - NARAYANPET

వారంతా కూలినాలి చేసుకుంటూ బతికే పేదలు. ఉపాధి హామీలో భాగంగా రోజూ ఉదయం పనులకు వెళ్తున్నారు. దురదృష్టవశాత్తు పని చేస్తుండగా మట్టిదిబ్బ కూలడంతో పది మంది కూలీలు మృతి చెందారు.

మట్టి దిబ్బ కూలి పది మంది మృతి
author img

By

Published : Apr 10, 2019, 12:55 PM IST

Updated : Apr 10, 2019, 2:44 PM IST

నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం తీలేరులో విషాదం చోటుచేసుకుంది. ఉదయమే ఉపాధి హామీ పనులకొచ్చి అనంతలోకాలకు వెళ్లిపోయారు. పనిచేస్తుండగా ఒక్కసారిగా మట్టి దిబ్బ కూలడంతో 10 మంది కూలీలు మృతి చెందారు. మట్టిదిబ్బ తవ్వుకుంటూ ఒక గ్రూపుగా ఉన్న 12 మంది లోపలికి వెళ్లారు. పైనుంచి మట్టి దిబ్బ కూలడంతో 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

కేసీఆర్​ దిగ్భ్రాంతి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉపాధి కూలీల మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

మట్టి దిబ్బ కూలి పది మంది మృతి

ఇవీ చదవండి: 'ఓటేసేందుకు దేశాలు దాటి రావాల్సిందేనా?'

నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం తీలేరులో విషాదం చోటుచేసుకుంది. ఉదయమే ఉపాధి హామీ పనులకొచ్చి అనంతలోకాలకు వెళ్లిపోయారు. పనిచేస్తుండగా ఒక్కసారిగా మట్టి దిబ్బ కూలడంతో 10 మంది కూలీలు మృతి చెందారు. మట్టిదిబ్బ తవ్వుకుంటూ ఒక గ్రూపుగా ఉన్న 12 మంది లోపలికి వెళ్లారు. పైనుంచి మట్టి దిబ్బ కూలడంతో 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

కేసీఆర్​ దిగ్భ్రాంతి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉపాధి కూలీల మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

మట్టి దిబ్బ కూలి పది మంది మృతి

ఇవీ చదవండి: 'ఓటేసేందుకు దేశాలు దాటి రావాల్సిందేనా?'

Last Updated : Apr 10, 2019, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.