నల్గొండలో తలదాచుకున్న ఏపీ తెదేపా నేతలు - వైసీపీ కార్యకర్తల దాడి
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మాచర్లలో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ తెదేపా నేతలు నల్గొండలో తలదాచుకున్నారు. దాడిలో గాయపడిన కిషోర్కు చికిత్స చేయించారు.

నల్గొండలో తలదాచుకున్న తెదేపా నేతలు
గుంటూరు జిల్లా మాచర్లలో తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగిన విషయం తెలిసిందే. ప్రాణభయంతో వారంతా అక్కడి నుంచి వచ్చి నల్గొండ పట్టణంలో తలదాచుకున్నారు.
నల్గొండలో తలదాచుకున్న తెదేపా నేతలు
వైసీపీ కార్యకర్తల దాడిలో కిషోర్ అనే వ్యక్తి తలకు బలమైన గాయమైంది. నల్గొండలోని ప్రవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించారు.
ఇదీ చదవండి : 4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం