నల్గొండ జిల్లా దేవరకొండలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 38వ రోజుకు చేరుకుంది. మొన్న ట్యాంక్ బండ్పై ఆర్టీసీ కార్మికుల మీద దాడి చేసిన కారణంగా ఆర్టీసీ జేఏసీ మంత్రుల, ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టింది.
ఆర్టీసీ కార్మికులు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఇంటిని ముట్టడించారు. ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: పెళ్లి కానుక చూసి బంధువులు ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే..?