ETV Bharat / state

సాగర్ అభివృద్ధి తెరాసతోనే సాధ్యం: నోముల భగత్

author img

By

Published : Apr 1, 2021, 12:24 PM IST

నాగార్జునసాగర్​ నియోజకవర్గ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని గులాబీ పార్టీ అభ్యర్థి నోముల భగత్​కుమార్​ అన్నారు. సాగర్ ఉపఎన్నికలో కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.

nagarjuna sagar, nagarjuna sagar by election, nomula bhagath
నోముల భగత్, నాగార్జునసాగర్, సాగర్ ఉపఎన్నిక

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తెరాస ప్రచార జోరు సాగిస్తోంది. త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురం, నీలాయిగూడెం, అంజనపల్లి, రాగడపలో గులాబీ పార్టీ అభ్యర్థి నోముల భగత్​ కుమార్ ప్రచారం నిర్వహించారు. త్రిపురారం మండల ఎన్నికల ఇంఛార్జ్​గా మహబూబాబాద్​ ఎమ్మెల్యే శంకర్​నాయక్, ఇతర తెరాస నేతలు పాల్గొన్నారు.

తెరాస శ్రేణులు భగత్​కుమార్​కు.. బతుకమ్మను పేర్చి బోనాలతో స్వాగతం పలికారు. సాగర్ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని భగత్​ అన్నారు. తన తండ్రి నోముల నర్సింహయ్య ఆశయాలు సాధించడానికి తనకొక అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ఉపఎన్నికలో కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తెరాస ప్రచార జోరు సాగిస్తోంది. త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురం, నీలాయిగూడెం, అంజనపల్లి, రాగడపలో గులాబీ పార్టీ అభ్యర్థి నోముల భగత్​ కుమార్ ప్రచారం నిర్వహించారు. త్రిపురారం మండల ఎన్నికల ఇంఛార్జ్​గా మహబూబాబాద్​ ఎమ్మెల్యే శంకర్​నాయక్, ఇతర తెరాస నేతలు పాల్గొన్నారు.

తెరాస శ్రేణులు భగత్​కుమార్​కు.. బతుకమ్మను పేర్చి బోనాలతో స్వాగతం పలికారు. సాగర్ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని భగత్​ అన్నారు. తన తండ్రి నోముల నర్సింహయ్య ఆశయాలు సాధించడానికి తనకొక అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ఉపఎన్నికలో కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.