తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చకిలం లలితా దేవి ఈ రోజు కన్నుమూశారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరానికి చెందిన లలితాదేవి శనివారం ఉదయం హైదరాబాద్ హుడా కాంప్లెక్స్లోని పెద్ద కొడుకు ఇంట్లో మృతి చెందారు. లలితాదేవి కోరిక మేరకు మరణానంతరం కుటుంభం సభ్యులు ఆమె కళ్లను దానం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భర్త తిరుమలరావు అడుగుజాడల్లో నడుస్తూ... నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. గర్భవతిగా ఉన్న సమయంలో ఔరంగబాద్ జైలులో రెండేళ్ల శిక్ష అనుభవించారు. జైల్లోనే కుమారుడికి జన్మనిచ్చారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో 50 మంది బాలకార్మికుల విముక్తి