నల్గొండ జిల్లాలోని అడవిదేవులపల్లి మండల పరిధిలోని నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ నుంచి దిగువకు... అధికారులు నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్థి స్థాయి నీటి సామర్థ్యం 7.08 టీఎంసీలు కాగా, డ్యాం నిండుకుండలా పూర్తి స్థాయి నీటిమట్టాన్ని కలిగి ఉంది.
18 గేట్లు ఎత్తివేతతో...
జలాశయంలో ప్రస్తుతం 75.50 మీటర్ల వరకు నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 84,981 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 18 గేట్ల ద్వారా 84,024 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
వచ్చింది వచ్చినట్లుగానే...
శ్రీశైలం నుంచి సాగర్కు భారీ వరద ప్రవాహం పెరిగినందున... నీటి సామర్థ్యాన్ని బట్టి టెయిల్ పాండ్ నుంచి అదేస్థాయిలో దిగువకు విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : నాగార్జున సాగర్కు భారీ ఇన్ఫ్లో..12 గేట్లు ఎత్తివేత