నల్లగొండ జిల్లా దేవరకొండలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రహారి గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. లాక్డౌన్ కారణంగా స్కూలు మూసి ఉండడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రహారి గోడ వెంబడి మురికి కాలువ ఉన్నందునే గోడ కూలి ఉంటుందని స్థానికులు తెలిపారు. గోడ కూలి రెండు రోజులు అవుతుందని... వార్డు కౌన్సిలర్, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా... ఎవరూ స్పందిచలేదని తెలిపారు. వెంటనే స్పందించి ప్రహారి నిర్మాణం చేపట్టాలని కోరారు.
ఇవీ చూడండి: దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం... చూపరులకు కనువిందు