రాష్ట్రంలో చేసిన అభివృద్ధి మాదిరిగానే దేశంలోనూ చేసేందుకు ముఖ్యమంత్రి పూనుకున్నారని మంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో రోడ్షోలు నిర్వహించారు. మంత్రి జగదీశ్రెడ్డితోపాటు ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎంపీ అభ్యర్థి నర్సింహారెడ్డి పాల్గొన్నారు. రోజూ... రాహుల్, మోదీకి విమర్శలు చేసుకోవటం తప్ప ప్రజల సమస్యలు పట్టవని మంత్రి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 స్థానాలు కీలకం కానున్నాయని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి:సీఎంను ప్రకటించిన కౌన్సిలర్... అవాక్కైన మంత్రి..!