ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలంటూ అన్నదాతల ధర్నా - ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలంటూ ధర్నా

పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి 15-20 రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు కొనుగోలు ప్రారంభించలేదంటూ నల్గొండ జిల్లా అన్నారం వద్ద రైతులు ధర్నాకు దిగారు. కాంగ్రెస్​ నాయకులతో కలిసి బైఠాయించి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్​ చేశారు.

protest by farmers  to open grain buying centres at nalgonda
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలంటూ అన్నదాతల ధర్నా
author img

By

Published : Oct 16, 2020, 3:30 PM IST

నల్గొండ జిల్లా రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఒకవైపు వర్షాలతో మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ఉన్న పలు ఐకేపీ సెంటర్లలోని ధాన్యం తడిసిపోయింది. తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 15-20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు మాత్రం ప్రారంభించకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు.

శుక్రవారం జి.అన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్​ను ప్రారంభించాలంటూ కాంగ్రెస్​ నాయకులతో కలిసి రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం త్వరగా ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రోడ్డుపై బైఠాయించి డిమాండ్​ చేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు సోమవారం నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వగా రైతులు ఆందోళనను విరమించారు.

నల్గొండ జిల్లా రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఒకవైపు వర్షాలతో మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ఉన్న పలు ఐకేపీ సెంటర్లలోని ధాన్యం తడిసిపోయింది. తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 15-20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు మాత్రం ప్రారంభించకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు.

శుక్రవారం జి.అన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్​ను ప్రారంభించాలంటూ కాంగ్రెస్​ నాయకులతో కలిసి రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం త్వరగా ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రోడ్డుపై బైఠాయించి డిమాండ్​ చేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు సోమవారం నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వగా రైతులు ఆందోళనను విరమించారు.

ఇదీ చూడండి: భాగ్యనగరంలో పేదల బతుకుల్ని చిదిమేసిన వర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.