ETV Bharat / state

Nomula bhagath: యాదగిరి పొలం పనుల్లో ఎమ్మెల్యే నోముల భగత్!

author img

By

Published : Jul 10, 2021, 4:16 PM IST

వరి పంట సాగులో వెదజల్లు పద్ధతిని రైతులు అందరూ అలవర్చుకోవాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్(Nomula bhagath) కోరారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లిలో తాటి యాదగిరి పొలంలో వడ్లను వెదజల్లారు.

Nomula bhagath
నోముల భగత్​, ఎమ్మెల్యే
Nomula bhagath: వెదజల్లు పద్ధతిలో వరి సాగు చేయాలి: నోముల భగత్​

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లిలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్(Nomula bhagath) పర్యటించారు. తాటి యాదగిరి అనే రైతు తనకు ఉన్నమూడు ఎకరాల పొలంలో వరిని వెదజల్లు పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. భగత్​ స్వయంగా మడిలోకి దిగి వడ్లను వెదజల్లారు.

వరి పంట సాగులో వెదజల్లు పద్ధతిని రైతులు అందరూ అలవర్చుకోవాలని కోరారు. వెదజల్లడం వల్ల అన్ని రకాలుగా రైతులకు మేలు చేకూరుతుందని చెప్పారు. కూలీల కొరత, కలుపు తీత ఖర్చులతోపాటు పెట్టుబడి కూడా తగ్గుతుందని తెలిపారు. పంట దిగుబడి కూడా పెరుగుతుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వెద జల్లు పద్ధతిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సీఎం కేసీఆర్ కూడా వెద జల్లు పద్ధతిలో వరి సాగు చేయాలని చెప్పారని గుర్తు చేశారు.

నారు పోసి నాటు వేసే బదులు వెదజల్లు పద్ధతిలో వరి సాగు చేయాలని సీఎం కేసీఆర్​ చెప్పారు. ముఖ్యమంత్రి పిలుపుతో ఎర్రబెల్లిలో తాటి యాదగిరి వెదజల్లు పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. వరి బాగా పండాలని యాదగిరికి శుభాకాంక్షలు చెబుతున్నాను. నా పొలంలో కూడా వెదజల్లు పద్ధతిలో ఉల్లి సాగు చేస్తున్నాను.

-నోముల భగత్​, నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే

ఇదీ చదవండి: కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడుతం: కేటీఆర్​

Nomula bhagath: వెదజల్లు పద్ధతిలో వరి సాగు చేయాలి: నోముల భగత్​

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లిలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్(Nomula bhagath) పర్యటించారు. తాటి యాదగిరి అనే రైతు తనకు ఉన్నమూడు ఎకరాల పొలంలో వరిని వెదజల్లు పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. భగత్​ స్వయంగా మడిలోకి దిగి వడ్లను వెదజల్లారు.

వరి పంట సాగులో వెదజల్లు పద్ధతిని రైతులు అందరూ అలవర్చుకోవాలని కోరారు. వెదజల్లడం వల్ల అన్ని రకాలుగా రైతులకు మేలు చేకూరుతుందని చెప్పారు. కూలీల కొరత, కలుపు తీత ఖర్చులతోపాటు పెట్టుబడి కూడా తగ్గుతుందని తెలిపారు. పంట దిగుబడి కూడా పెరుగుతుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వెద జల్లు పద్ధతిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సీఎం కేసీఆర్ కూడా వెద జల్లు పద్ధతిలో వరి సాగు చేయాలని చెప్పారని గుర్తు చేశారు.

నారు పోసి నాటు వేసే బదులు వెదజల్లు పద్ధతిలో వరి సాగు చేయాలని సీఎం కేసీఆర్​ చెప్పారు. ముఖ్యమంత్రి పిలుపుతో ఎర్రబెల్లిలో తాటి యాదగిరి వెదజల్లు పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. వరి బాగా పండాలని యాదగిరికి శుభాకాంక్షలు చెబుతున్నాను. నా పొలంలో కూడా వెదజల్లు పద్ధతిలో ఉల్లి సాగు చేస్తున్నాను.

-నోముల భగత్​, నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే

ఇదీ చదవండి: కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడుతం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.