నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల భగత్ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి కేసీఆర్ను కలిశారు. కుటుంబ సభ్యులతో సహా ప్రగతిభవన్కు వెళ్లిన భగత్.. సీఎం ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా భగత్ కుటుంబ సభ్యులతో.. కేసీఆర్ సరదాగా ముచ్చటించారు. నోముల నర్సింహయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నట్లు సమాచారం. అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టిసారించాలని.. ప్రభుత్వం పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని.. ఎమ్మెల్యే భగత్కు ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేస్తామని భగత్కు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇవీచూడండి: 'ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకొని సహకరించుకోవాలి'