నల్గొండ జిల్లా దేవరకొండలోని మార్కెట్ను స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అధికారులతో కలిసి సందర్శించారు. అమ్మకందార్లను అడిగి కూరగాయల రేట్లను తెలుసుకున్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో ఎవరూ కూరగాయలను అధిక ధరలకు అమ్మరాదని.. అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్డౌన్తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.
హాలియాలోనూ..
మరోవైపు హాలియా పురపాలక సంఘ పరిధిలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పర్యటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తన వంతు సాయంగా తన నెల జీతాన్ని, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. 3 కోట్లను సీఎం సహాయనిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో, రాష్ట్రంలో వ్యాపించడం, ప్రజలను ఇబ్బందిపెట్టడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
కరోనాను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ను అర్థం చేసుకుని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.