నల్గొండ జిల్లా హాలియా పురపాలికలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నిత్యావసర సరుకులు అందజేశారు.
అనంతరం నాగార్జునసాగర్లోని పైలాన్కాలనీలో రసాయన ద్రావణాన్ని ఎమ్మెల్యే పిచికారీ చేయించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రజలు బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.
నాగార్జునసాగర్ వంతెన వద్ద ఉన్న చెక్పోస్టును తనిఖీ చేసి, బయట నుంచి ఎవరూ రాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆదేశించారు.