ETV Bharat / state

వ్యవసాయ మంత్రిని కలిసిన ప్రభుత్వ విప్ గొంగిడి సునిత

ఏఈవోల దగ్గర ఆగిపోయిన రైతు బీమా పథకం దరఖాస్తులు ఆన్​లైన్​లో నమోదు చేయడానికి అవకాశం కల్పించాలని కోరుతూ.. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్​ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డిని కలిశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వెబ్​సైట్​ను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

author img

By

Published : Sep 22, 2020, 2:17 PM IST

MLA Gongidi Sunitha Meets Minister Niranjan Reddy
వ్యవసాయ మంత్రిని కలిసిన ప్రభుత్వ విప్ గొంగిడి సునిత

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబీమా పథకం లబ్దిదారులను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీలోగా వెబ్​సైట్​లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే.. సాంకేతిక కారణాల వల్ల రైతుబీమా వెబ్​సైట్​ నిలిపివేశారు. రైతులకు సంబంధించిన చాలా దరఖాస్తులు ఏఈవోల దగ్గరే ఆగిపోయాయి. రైతులకు న్యాయం జరిగేలా.. రైతుబీమా దరఖాస్తు చేసుకోవడానికి.. వెబ్​సైట్​ తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్​ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించి మంత్రి.. తగిన ఆదేశాలు జారీ చేసి.. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబీమా పథకం లబ్దిదారులను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీలోగా వెబ్​సైట్​లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే.. సాంకేతిక కారణాల వల్ల రైతుబీమా వెబ్​సైట్​ నిలిపివేశారు. రైతులకు సంబంధించిన చాలా దరఖాస్తులు ఏఈవోల దగ్గరే ఆగిపోయాయి. రైతులకు న్యాయం జరిగేలా.. రైతుబీమా దరఖాస్తు చేసుకోవడానికి.. వెబ్​సైట్​ తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్​ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించి మంత్రి.. తగిన ఆదేశాలు జారీ చేసి.. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: చినుకుకే వణుకుతున్న మహానగరం.. నాలాలే కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.