ETV Bharat / state

'కరోనా వేళ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు' - LOCK DOWN EFFECT ON LABOUR

కరోనా వేళ కార్మికులంతా ఆకలితో అలమటిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన మే డే ఉత్సవాల్లో జాలకంటి పాల్గొన్నారు.

MAY DAY CELEBRATIONS IN MIRYALAGUDA
'కరోనా వేళ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు'
author img

By

Published : May 1, 2020, 8:32 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గూడూరులో మే డే సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులకు, పేదవారికి కూరగాయలు పంపిణీ చేశారు.

లాక్​డౌన్ వల్ల కార్మికులు, పేదవారు ఆకలితో అలమటిస్తున్నారని జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సహాయం 'ఊరికి ఒక కోడి.. ఇంటికి ఒక ఈగ' అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గూడూరులో మే డే సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులకు, పేదవారికి కూరగాయలు పంపిణీ చేశారు.

లాక్​డౌన్ వల్ల కార్మికులు, పేదవారు ఆకలితో అలమటిస్తున్నారని జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సహాయం 'ఊరికి ఒక కోడి.. ఇంటికి ఒక ఈగ' అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.