ETV Bharat / state

సాగర్​ ఉపఎన్నిక: గెలుపే లక్ష్యంగా జోరందుకున్న పార్టీల ప్రచారం

author img

By

Published : Apr 1, 2021, 8:01 PM IST

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలతో... ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్షేమ పథకాలే ప్రధాన అస్త్రంగా... అధికార తెరాస ప్రచారం సాగిస్తుంటే... ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

main parties campaigns in nagarjuna sagar by election
main parties campaigns in nagarjuna sagar by election

దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో వచ్చిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. తెరాస తరఫున బరిలో నిలిచిన నోముల తనయుడు భగత్‌... విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. త్రిపురారం మండలం సత్యనారాయణపురం, నీలాయిగూడెం, అంజనపల్లి, రాగడపలో రోడ్‌షో నిర్వహించారు. మహబూబా‌బాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ప్రచారంలో పాల్గొన్నారు. సాగర్‌ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని... ఉపఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తన తండ్రి ఆశయాలు సాధించడం కోసం తనకు అవకాశం ఇవ్వాలని భగత్‌ ఓటర్లను అభ్యర్థించారు. ఉపఎన్నికకు సంబంధించి తెరాస ఇంఛార్జ్‌లు, ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. సమష్టిగా కృషి చేసి... సాగర్‌ను మళ్లీ నిలబెట్టుకుందామని నేతలు సూచించారు.

కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన సీనియర్‌ నేత జానారెడ్డి... తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హాలియా పురపాలిరక పరిధిలో పలువురు తెరాస నాయకులు..కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువా కప్పిన జానారెడ్డి... పార్టీలోకి ఆహ్వానించారు. తన హయాంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి.... ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తారని జానారెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

భాజపా అభ్యర్థి రవినాయక్ ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. మాడుగులపల్లి మండలం ఆబంగాపురం ఆంజనేయస్వామి ఆలయంలో సతిసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాగర్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా... నియోజకవర్గానికి ఈశాన్య దిక్కున ఉన్న ఆబంగాపురం నుంచి ఎన్నికల ప్రచారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. గజలాపురం, పూసలపాడు, కంపాలాపల్లి, ధర్మాపురంలో భాజపా నాయకులు ఇంటింటికీ తిరిగి... రవి నాయక్‌ను గెలిపించాలని కోరారు.

సాగర్ ఉపఎన్నికలో తెరాసను ఓడించాలని.... తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పెరిగిపోయిందని.... కరోనా కాలంలోనూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు. నల్గొండలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన కోదండరాం.. ఆదివారం వరకు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. సాగర్‌ ఉపఎన్నికకు ఏప్రిల్‌ 17న పోలింగ్‌ జరగనుండగా.... మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: సాగర్ ఉపఎన్నికలో కంకణాల దంపతుల దారెటు?

దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో వచ్చిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. తెరాస తరఫున బరిలో నిలిచిన నోముల తనయుడు భగత్‌... విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. త్రిపురారం మండలం సత్యనారాయణపురం, నీలాయిగూడెం, అంజనపల్లి, రాగడపలో రోడ్‌షో నిర్వహించారు. మహబూబా‌బాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ప్రచారంలో పాల్గొన్నారు. సాగర్‌ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని... ఉపఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తన తండ్రి ఆశయాలు సాధించడం కోసం తనకు అవకాశం ఇవ్వాలని భగత్‌ ఓటర్లను అభ్యర్థించారు. ఉపఎన్నికకు సంబంధించి తెరాస ఇంఛార్జ్‌లు, ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. సమష్టిగా కృషి చేసి... సాగర్‌ను మళ్లీ నిలబెట్టుకుందామని నేతలు సూచించారు.

కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన సీనియర్‌ నేత జానారెడ్డి... తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హాలియా పురపాలిరక పరిధిలో పలువురు తెరాస నాయకులు..కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువా కప్పిన జానారెడ్డి... పార్టీలోకి ఆహ్వానించారు. తన హయాంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి.... ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తారని జానారెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

భాజపా అభ్యర్థి రవినాయక్ ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. మాడుగులపల్లి మండలం ఆబంగాపురం ఆంజనేయస్వామి ఆలయంలో సతిసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాగర్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా... నియోజకవర్గానికి ఈశాన్య దిక్కున ఉన్న ఆబంగాపురం నుంచి ఎన్నికల ప్రచారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. గజలాపురం, పూసలపాడు, కంపాలాపల్లి, ధర్మాపురంలో భాజపా నాయకులు ఇంటింటికీ తిరిగి... రవి నాయక్‌ను గెలిపించాలని కోరారు.

సాగర్ ఉపఎన్నికలో తెరాసను ఓడించాలని.... తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పెరిగిపోయిందని.... కరోనా కాలంలోనూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు. నల్గొండలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన కోదండరాం.. ఆదివారం వరకు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. సాగర్‌ ఉపఎన్నికకు ఏప్రిల్‌ 17న పోలింగ్‌ జరగనుండగా.... మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: సాగర్ ఉపఎన్నికలో కంకణాల దంపతుల దారెటు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.