ETV Bharat / state

నల్గొండలో భారీ వర్షం.. జలదిగ్బంధంలో కాలనీలు - heavy rain in nalgonda- many people become homeless

నల్గొండ పట్టణంలో నిన్న కురిసిన భారీ వర్షానికి... వీధులన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి... జనం అవస్థలు పడ్డారు. రికార్డు స్థాయిలో ఆరు గంటల్లోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో... కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

నల్గొండలో భారీ వర్షం.. జలదిగ్బంధంలో కాలనీలు
author img

By

Published : Sep 18, 2019, 5:35 PM IST

నల్గొండలో భారీ వర్షం.. జలదిగ్బంధంలో కాలనీలు

ఎన్నడూ లేనంత స్థాయిలో... నల్గొండ జిల్లా కేంద్రాన్ని వర్షం వణికించింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వానకు... వీధులన్నీ జల సంద్రంగా మారాయి. పలుచోట్ల చెట్లు విరిగి తీగలపై పడినందున... విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీటీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, లెప్రసీ కాలనీ... ముంపు బారిన పడ్డాయి.

లెప్రసీ కాలనీలోని ఇళ్లల్లోకి నీరు చేరడంతో... స్థానికులు ఉదయం నుంచి అవస్థలు పడ్డారు. ప్రకాశం బజార్​లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. కాలనీల్లో పరిస్థితిని ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. బాధితులకు... సమీపంలోని ప్రార్థన మందిరంలో ఆశ్రయం కల్పించారు.

కేవలం ఆరు గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో... 20.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవడం కలవరానికి గురి చేసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు రహదారిపై పారిన వరదలతో... వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అద్దంకి - నార్కట్​పల్లి రహదారిపై నీరు నిలిచి... జనం అవస్థలు పడ్డారు.

ఇదీ చదవండిః 'వారి జీవితాల్లో విషాదం నింపిన విహారయాత్ర'

నల్గొండలో భారీ వర్షం.. జలదిగ్బంధంలో కాలనీలు

ఎన్నడూ లేనంత స్థాయిలో... నల్గొండ జిల్లా కేంద్రాన్ని వర్షం వణికించింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వానకు... వీధులన్నీ జల సంద్రంగా మారాయి. పలుచోట్ల చెట్లు విరిగి తీగలపై పడినందున... విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీటీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, లెప్రసీ కాలనీ... ముంపు బారిన పడ్డాయి.

లెప్రసీ కాలనీలోని ఇళ్లల్లోకి నీరు చేరడంతో... స్థానికులు ఉదయం నుంచి అవస్థలు పడ్డారు. ప్రకాశం బజార్​లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. కాలనీల్లో పరిస్థితిని ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. బాధితులకు... సమీపంలోని ప్రార్థన మందిరంలో ఆశ్రయం కల్పించారు.

కేవలం ఆరు గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో... 20.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవడం కలవరానికి గురి చేసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు రహదారిపై పారిన వరదలతో... వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అద్దంకి - నార్కట్​పల్లి రహదారిపై నీరు నిలిచి... జనం అవస్థలు పడ్డారు.

ఇదీ చదవండిః 'వారి జీవితాల్లో విషాదం నింపిన విహారయాత్ర'

Intro:tg_nlg_52_18_full rain_pkg_ts10064
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఆరు మండలాల్లో నిన్న రాత్రి నుండి ఆగకుండా కురిసిన వర్షానికి హాలియా లోని వాగు కు వరద ప్రవాహాo పెరిగింది. హాలియా లోని లోత్తట్టు ప్రాంతం అయిన జంగాల కాలనీ లో గూడిసెల్లో కి వరద నీరు చేరి కాలనీ వీధులు అన్ని బురద మయo గా మారాయి.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అనుముల మండల పరిధిలోని పంట పొలాలు నీట మునిగాయి అనుముల మండలం లో ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. 103.9 గా వర్షపాతం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు.


Body:అనుముల మండల పరిధిలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు ఈ ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి హాలియా పురపాలక సంఘం పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో లోతట్టు ప్రాంత మైన జంగాల కాలనీ వారి గుడిసెలోకి నీరు రావడంతో హాలియా వాగు దగ్గర ఉండడంతో వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది మండల పరిధిలో పేరూరు గ్రామంలోని చెరువు అలుగు నిర్వహణ సరిగా లేకపోవడం తో నింహ్డిన నీరు మొత్తం దిగువన ఉన్న దాదాపు రెండు వందల ఎకరాల పంట నీట మునిగి ఉంది పంట పొందినప్పటికీ అధికారులు ఎవరూ స్పందించలేదని రైతులు అంటున్నారు కాలనీ వీధుల్లోకి నీరు చేరి పాములు కప్పలు వస్తున్నాయి అని కాలనీవాసులు వర్షం పడితే భయం గుప్పిట్లో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బైట్: రాములు కాలని వాసి హాలియా.
బైట్: మంగమ్మ, కాలనీ వాసి, హాలియా.


Conclusion:అనుముల మండల పరిధిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి పంటపొలాల మీదికి వరద రావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు సాగర్ ఎడమ కాలువ వచ్చి నెల కావడంతో ఇప్పుడే నాట్లు వేస్తున్న దశలో ఉండి కలుపు తీసే సమయంలో వరద రావడంతో పంట పొలాలు గండి పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు నిండిన అప్పటికీ అలుగులు ,తూముల నిర్వహణ సరిగా లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికి చెరువులో ఉన్న నీరు దిగువ వృధాగా వెళ్లిపోవడంతో వెళ్తూ పంటపొలాలను నష్టం చేయడంతో రైతులు చెరువు పూడిక తీసిన ఉపయోగం లేదని గుత్తేదారులు పనులు చేయడంలో లో నామమాత్రంగా ఉండి అరకొర పనులు చేసి ఇ చేతులు దులుపుకున్నారు అని దీంతో ఆ ప్రభావం రైతుల మీద పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బైట్: రమేష్,రైతు,పేరూర్
బైట: కొండల్ రైతు పేరూర్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.