ETV Bharat / state

నిండుకుండలా మారి 42 రోజులుగా అలుగుపోస్తున్న డిండి జలాశయం

కరవు ప్రాంత వరప్రదాయినిగా భావించే డిండి జలాశయం... అరుదైన రీతిలో అలుగుపోస్తోంది. ఎత్తు నుంచి పడుతున్న నీరు జలపాతాన్ని తలపిస్తోంది. ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్థాయిలో జలసవ్వడి కనిపించలేదు. ఇటీవల కురిసిన వర్షాలతో నెలన్నర పాటు అలుగుపోయడం... అరుదైనదిగా చెబుతున్నారు.

author img

By

Published : Oct 30, 2020, 5:14 AM IST

Dindi Reservoir that has been flooded for 42 days in nalgonda district
నిండుకుండలా మారి 42 రోజులుగా అలుగుపోస్తున్న డిండి జలాశయం
నిండుకుండలా మారి 42 రోజులుగా అలుగుపోస్తున్న డిండి జలాశయం

దుందుభి వాగుపై నిర్మించిన డిండి ప్రాజెక్టు.. 42 రోజులుగా అలుగు పోస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ దశాబ్ద కాలంలో మూడుసార్లు మాత్రమే.. డిండి అలుగు పోసింది. 'హైదరాబాద్-శ్రీశైలం' మార్గంలో ఇపుడున్న వంతెన.. 2017లో అందుబాటులోకి రాగా... అంతకుముందు రహదారి పైనుంచే వరద పారేది. వాగు ఒడ్డున ఉన్న డిండి గ్రామాన్ని అప్పటి పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతమున్న ప్రాంతానికి మార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. చెక్‌డ్యాంలు లేక.. మత్తడి దూకిన నీరు నాగార్జునసాగర్‌లో కలుస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4.2 టీఎంసీలు వృథా అయినట్లు అధికారులు చెబుతున్నారు. కేవలం వర్షాధారంగా నిర్మితమైన డిండి ప్రాజెక్టు గరిష్ఠ నిల్వ సామర్థ్యం 2.4 టీఎంసీలు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి 2016లో అర టీఎంసీ నీటిని తీసుకుని.. డిండి మండలంలో 4 కుంటలు నింపారు. 2017లోనూ కేఎల్​ఐ ద్వారా 34.5 అడుగులు నిల్వ చేసి.. డిండి, చందంపేట, దేవరకొండ మండలాల్లో 54 చెరువులు సహా తాగునీటిని అందించారు.ఈ స్థాయిలో వరద రావడం వల్ల డిండి ఆయకట్టుదారుల్లో సంతోషం కనిపిస్తోంది.

36అడుగులకు మించి నీరు ప్రవహిస్తేనే..

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల సమీపంలో బ్యారేజీ నిర్మించి.. నల్గొండ జిల్లాలోని సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం ప్రాజెక్టులకు నీరు అందించాలన్న ప్రతిపాదనలున్నాయి. అటు శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోసి నీటిని తరలించాలని భావించారు. 36 అడుగులకు మించి నీరు ప్రవహిస్తేనే అలుగు సాధ్యమవుతుంది. అంటే నెలన్నర నుంచి డిండి జలాశయం... పూర్తిస్థాయి నీటిమట్టంతో తొణికిసలాడుతోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో భూగర్భజలాలు పెరగడంతోపాటు... ఎడమ కాల్వ కింద 12 వేల 750 ఎకరాలు సాగవుతోంది. కుడికాల్వ ద్వారా నాగర్ కర్నూల్ జిల్లాలో మరో 250 ఎకరాలకు నీరందుతోంది.

పూడిక తొలగించాలి..

36 అడుగుల గరిష్ఠ నిల్వ కలిగిన జలాశయంలో.. 6 అడుగుల మేర పూడిక పేరుకుపోయింది. పూడిక తొలగిస్తే మరింత నీటిని నిల్వ చేయొచ్చని.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఎలా ఉండబోతోంది?

నిండుకుండలా మారి 42 రోజులుగా అలుగుపోస్తున్న డిండి జలాశయం

దుందుభి వాగుపై నిర్మించిన డిండి ప్రాజెక్టు.. 42 రోజులుగా అలుగు పోస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ దశాబ్ద కాలంలో మూడుసార్లు మాత్రమే.. డిండి అలుగు పోసింది. 'హైదరాబాద్-శ్రీశైలం' మార్గంలో ఇపుడున్న వంతెన.. 2017లో అందుబాటులోకి రాగా... అంతకుముందు రహదారి పైనుంచే వరద పారేది. వాగు ఒడ్డున ఉన్న డిండి గ్రామాన్ని అప్పటి పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతమున్న ప్రాంతానికి మార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. చెక్‌డ్యాంలు లేక.. మత్తడి దూకిన నీరు నాగార్జునసాగర్‌లో కలుస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4.2 టీఎంసీలు వృథా అయినట్లు అధికారులు చెబుతున్నారు. కేవలం వర్షాధారంగా నిర్మితమైన డిండి ప్రాజెక్టు గరిష్ఠ నిల్వ సామర్థ్యం 2.4 టీఎంసీలు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి 2016లో అర టీఎంసీ నీటిని తీసుకుని.. డిండి మండలంలో 4 కుంటలు నింపారు. 2017లోనూ కేఎల్​ఐ ద్వారా 34.5 అడుగులు నిల్వ చేసి.. డిండి, చందంపేట, దేవరకొండ మండలాల్లో 54 చెరువులు సహా తాగునీటిని అందించారు.ఈ స్థాయిలో వరద రావడం వల్ల డిండి ఆయకట్టుదారుల్లో సంతోషం కనిపిస్తోంది.

36అడుగులకు మించి నీరు ప్రవహిస్తేనే..

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల సమీపంలో బ్యారేజీ నిర్మించి.. నల్గొండ జిల్లాలోని సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం ప్రాజెక్టులకు నీరు అందించాలన్న ప్రతిపాదనలున్నాయి. అటు శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోసి నీటిని తరలించాలని భావించారు. 36 అడుగులకు మించి నీరు ప్రవహిస్తేనే అలుగు సాధ్యమవుతుంది. అంటే నెలన్నర నుంచి డిండి జలాశయం... పూర్తిస్థాయి నీటిమట్టంతో తొణికిసలాడుతోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో భూగర్భజలాలు పెరగడంతోపాటు... ఎడమ కాల్వ కింద 12 వేల 750 ఎకరాలు సాగవుతోంది. కుడికాల్వ ద్వారా నాగర్ కర్నూల్ జిల్లాలో మరో 250 ఎకరాలకు నీరందుతోంది.

పూడిక తొలగించాలి..

36 అడుగుల గరిష్ఠ నిల్వ కలిగిన జలాశయంలో.. 6 అడుగుల మేర పూడిక పేరుకుపోయింది. పూడిక తొలగిస్తే మరింత నీటిని నిల్వ చేయొచ్చని.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఎలా ఉండబోతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.