ETV Bharat / state

Nagarjuna sagar: ఎగువ నుంచి తగ్గుతున్న ప్రవాహం

author img

By

Published : Aug 6, 2021, 6:44 AM IST

Updated : Aug 6, 2021, 7:45 AM IST

కృష్ణా నదిలో ఎగువ నుంచి ప్రవాహం తగ్గుతోంది. గురువారం ఉదయం ఆలమట్టి వద్ద 1.74 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా... సాయంత్రానికి 80 వేలకు పడిపోయింది. శుక్రవారం ఉదయం ఇన్‌ఫ్లో 2,50,136 క్యూసెక్కులుగా నమోదైంది.

water flow to Nagarjuna sagar, Nagarjuna sagar water levels
నాగార్జున సాగర్​ నీటి ప్రవాహం, తగ్గిన కృష్ణమ్మ నీటి ప్రవాహం

కృష్ణా నదిలో ఎగువ నుంచి ప్రవాహం క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. గురువారం ఉదయం ఆలమట్టి వద్ద 1.74 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా సాయంత్రానికి 80 వేలకు పడిపోయింది. దీంతో దిగువకు కూడా 80 వేలే వదులుతున్నారు. నారాయణపూర్‌ నుంచి కూడా దిగువకు నీటి విడుదల తగ్గింది. జూరాలకు 1.71 లక్షలు వస్తుండగా 1.46 లక్షలు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి 29 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలానికి 1.52 లక్షలు వస్తుండగా ఏపీ, తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తితోపాటు స్పిల్‌వే ద్వారా 2.02 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు.

నాగార్జునసాగర్‌కు రాత్రి 7 గంటల వరకు 2.85 లక్షలు రాగా డ్యాం నుంచి 16 గేట్లను ఎత్తి 2.38 లక్షలు దిగువకు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ఇన్‌ఫ్లో 2,50,136 క్యూసెక్కులు కాగా... ఔట్‌ఫ్లో 1,68,025 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 588.80 అడుగుల వద్ద ఉంది.

పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో మరమ్మతులకు అనుగుణంగా నీటి మట్టాన్ని క్రమంగా తగ్గిస్తున్నారు. 17 గేట్లు తెరిచి 5.05 లక్షలు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 312.0450 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 308.4658 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదను సముద్రం వైపు విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి: EETELA ON DALITHA BANDHU: దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి: ఈటల

కృష్ణా నదిలో ఎగువ నుంచి ప్రవాహం క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. గురువారం ఉదయం ఆలమట్టి వద్ద 1.74 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా సాయంత్రానికి 80 వేలకు పడిపోయింది. దీంతో దిగువకు కూడా 80 వేలే వదులుతున్నారు. నారాయణపూర్‌ నుంచి కూడా దిగువకు నీటి విడుదల తగ్గింది. జూరాలకు 1.71 లక్షలు వస్తుండగా 1.46 లక్షలు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి 29 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలానికి 1.52 లక్షలు వస్తుండగా ఏపీ, తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తితోపాటు స్పిల్‌వే ద్వారా 2.02 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు.

నాగార్జునసాగర్‌కు రాత్రి 7 గంటల వరకు 2.85 లక్షలు రాగా డ్యాం నుంచి 16 గేట్లను ఎత్తి 2.38 లక్షలు దిగువకు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ఇన్‌ఫ్లో 2,50,136 క్యూసెక్కులు కాగా... ఔట్‌ఫ్లో 1,68,025 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 588.80 అడుగుల వద్ద ఉంది.

పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో మరమ్మతులకు అనుగుణంగా నీటి మట్టాన్ని క్రమంగా తగ్గిస్తున్నారు. 17 గేట్లు తెరిచి 5.05 లక్షలు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 312.0450 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 308.4658 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదను సముద్రం వైపు విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి: EETELA ON DALITHA BANDHU: దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి: ఈటల

Last Updated : Aug 6, 2021, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.