ETV Bharat / state

ఉపఎన్నికలో తెరాసకు తగిన బుద్ధి చెప్పాలి: జానారెడ్డి - ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ నేతలు

సాగర్​ ఉపఎన్నికలో అధికార, ప్రతిపక్షాలు ప్రచారం ముమ్మరం చేశాయి. కాంగ్రెస్​, తెరాస మధ్యనే ప్రధానంగా పోటీ జరగనుండగా ముఖ్య నేతలందరూ ప్రచారంలో పర్యటిస్తున్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి పాల్గొన్నారు.

Congress leaders election campaign in sagar
సాగర్​ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి
author img

By

Published : Apr 3, 2021, 8:46 PM IST

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్​ను గెలిపించాలని జానారెడ్డి కోరారు. ప్రజలను దోచుకుంటున్న తెరాసకు తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా నిడమనూరు మండల తుమ్మడంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

అంతకుముందే జానారెడ్డి హాలియాలోని పలువురు కాంగ్రెస్​ నాయకులతో సమావేశం నిర్వహించారు. గుర్రంపోడు మండలం నుంచి వచ్చిన తెరాస నాయకులను కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు. అధికార తెరాసకు తగిన గుణపాఠం చెప్పేందుకు సాగర్ ఉపఎన్నిక కీలకమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సాగర్ అభివృద్ధికి దశాబ్దాలుగా కృషి చేసిన జానారెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రులు షబ్బీర్​ అలీ, దామోదర్ రెడ్డి ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వేసవిలో నిరంతర విద్యుత్​ సరఫరా జరగాలి: రఘుమారెడ్డి

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్​ను గెలిపించాలని జానారెడ్డి కోరారు. ప్రజలను దోచుకుంటున్న తెరాసకు తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా నిడమనూరు మండల తుమ్మడంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

అంతకుముందే జానారెడ్డి హాలియాలోని పలువురు కాంగ్రెస్​ నాయకులతో సమావేశం నిర్వహించారు. గుర్రంపోడు మండలం నుంచి వచ్చిన తెరాస నాయకులను కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు. అధికార తెరాసకు తగిన గుణపాఠం చెప్పేందుకు సాగర్ ఉపఎన్నిక కీలకమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సాగర్ అభివృద్ధికి దశాబ్దాలుగా కృషి చేసిన జానారెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రులు షబ్బీర్​ అలీ, దామోదర్ రెడ్డి ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వేసవిలో నిరంతర విద్యుత్​ సరఫరా జరగాలి: రఘుమారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.