ETV Bharat / state

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను: జానారెడ్డి

author img

By

Published : May 2, 2021, 7:09 PM IST

నాగార్జునసాగర్​ ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో గెలిచిన తెరాస అభ్యర్థి నోముల భగత్​కు అభినందనలు తెలిపారు.

jana reddy
jana reddy

సాగర్​ ఉప ఎన్నికలో ప్రజల తీర్పును స్వాగతిస్తున్నానని జానారెడ్డి అన్నారు. ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచేందుకు ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. తనను ఆశీర్వదించిన ఓటర్లకు, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు, ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

ఉప ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగమంతా సర్వశక్తులు ఒడ్డినా... ఓట్ల శాతంలో తేడా పది మాత్రమేనని జానా వెల్లడించారు. అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. సాగర్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​కు 37 శాతం ఓట్లు వచ్చాయి. 47 శాతం ఓట్లు సాధించిన తెరాస విజయం సాధించింది.

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను: జానారెడ్డి

ఇదీ చూడండి: నాగార్జున సాగర్​లో జోరు తగ్గని కారు

సాగర్​ ఉప ఎన్నికలో ప్రజల తీర్పును స్వాగతిస్తున్నానని జానారెడ్డి అన్నారు. ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచేందుకు ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. తనను ఆశీర్వదించిన ఓటర్లకు, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు, ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

ఉప ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగమంతా సర్వశక్తులు ఒడ్డినా... ఓట్ల శాతంలో తేడా పది మాత్రమేనని జానా వెల్లడించారు. అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. సాగర్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​కు 37 శాతం ఓట్లు వచ్చాయి. 47 శాతం ఓట్లు సాధించిన తెరాస విజయం సాధించింది.

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను: జానారెడ్డి

ఇదీ చూడండి: నాగార్జున సాగర్​లో జోరు తగ్గని కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.