ETV Bharat / state

సాగర్‌లో గెలుపే లక్ష్యం... ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం

author img

By

Published : Apr 11, 2021, 10:30 PM IST

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు మరో వారం మాత్రమే సమయం మిగిలి ఉండటం వల్ల పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు... వ్యూహ-ప్రతివ్యూహాలతో ఓటర్ల ప్రసన్నానికి తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా... గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ... ప్రత్యర్థులను చిత్తుచేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

sagar campaign
సాగర్‌లో గెలుపే లక్ష్యం
ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం

ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికకు మరో వారం రోజులే మిగిలి ఉంది. రాష్ట్ర స్థాయి నేతలంతా నియోజకవర్గంలోనే తిష్టవేసి... తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. అధికార పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను, జిల్లాల ముఖ్యనేతలను రంగంలోకి దించుతుండగా... ప్రతిపక్ష కాంగ్రెస్, భాజపాలు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను ప్రచారానికి తీసుకువస్తోంది. సిట్టింగ్‌ స్థానం, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్న తెరాస... సర్వశక్తులొడ్డుతూ సత్తాచాటేందుకు యత్నిస్తోంది.

కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నేత జానారెడ్డి బరిలో ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకతతో తమ గెలుపు తథ్యమని హస్తం పార్టీ ధీమాతో ఉంది. మరో ప్రధాన పార్టీ భాజపా.... ఇటీవల వరుస విజయాలతో ఇక్కడ కూడా తమ సత్తాచాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు, రాష్ట్రస్థాయి నేతలతో జోరుగా ప్రచారం సాగిస్తోంది.

జోరుగా ప్రచారం...

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం ఎర్ర చెరువు, నెల్లికల్, జాలు తండాల్లో... తెరాస అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. కాంగ్రెస్‌ నేత జానారెడ్డి హయాంలో నియోజకవర్గానికి చేసిందేమి లేదని... తెరాస పాలనలోనే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనించాయని తెలిపారు. తెరాస అభ్యర్థికి మరోసారి ప్రజలు పట్టం కట్టాలని మంత్రులు కోరారు. గుర్రంపోడు మండలం కొప్పోలు, మొసంగి గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

పెనుమార్పులు...

జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గుర్రంపోడ్‌ మండలంలో జానారెడ్డికి మద్దతుగా పార్టీ నేతలతో కలిసి వారు ప్రచారం నిర్వహించారు. తెరాస నేతలు డబ్బు, మద్యంతో గెలుపొందాలని యత్నిస్తున్నారని వారు ఆరోపించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో జానారెడ్డి తమ సీఎం అభ్యర్థిగా ఒప్పిస్తామని తెలిపారు.

రంగంలోకి కేంద్రమంత్రులు...

భాజపా అభ్యర్థి రవి కుమార్‌ నాయక్‌కు మద్దతుగా కేంద్ర మంత్రులు అర్జున్‌రాం మేఘవాల్, కిషన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. అనుముల మండలం పులిమామిడి, మారేపల్లి, అన్నారంలో కిషన్‌రెడ్డి రోడ్‌షో చేశారు. నిరుద్యోగులను కేసీఆర్ సర్కారు మోసం చేసిందని... కాంగ్రెస్‌, తెరాస సాగర్‌కు చేసిందేమి లేదని విమర్శించారు. సాగర్ ఉపఎన్నికలో భాజపా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘలాల్‌ తెలిపారు. జనరల్‌ స్థానంలో ఎస్టీ అభ్యర్థికి టికెట్‌ ఇచ్చిన ఘనత భాజపాదేనని చెప్పారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. కానీ, ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు నోచుకోవటంలేదు. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అంశాల్లో అడుగడుగునా అవినీతి పేరుకుపోయింది. టీఎస్‌పీఎస్‌సీకి కనీసం ఛైర్మన్‌ కూడా లేని పరిస్థితి. అక్కడున్న సభ్యుడే ఛైర్మన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ కల్పన ఎలా సాధ్యమవుతుంది? జనరల్‌కు కేటాయించిన స్థానంలో ఎస్టీ అభ్యర్థి రవి కుమార్‌ నాయక్‌కు భాజపా టికెట్‌ ఇచ్చింది. మా అభ్యర్థికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఉపఎన్నికలో భాజపా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి.

-- అర్జున్‌రాం మేఘవాల్, కేంద్రమంత్రి

మరోవైపు తెదేపా అభ్యర్థి మువ్వ అరుణ్ కుమార్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన స్వగ్రామమైన అనుముల మండలం చింతగూడెం నుంచి భారీ ప్రదర్శనగా ప్రచారానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, కళాకారులు కోలాటాలు వేస్తూ ప్రదర్శన నిర్వహించారు.

ఇవీచూడండి: నీతి ఆయోగ్ మెచ్చిన టీడీఆర్.. స్థిరాస్తి వ్యాపారుల మొగ్గు!

ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం

ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికకు మరో వారం రోజులే మిగిలి ఉంది. రాష్ట్ర స్థాయి నేతలంతా నియోజకవర్గంలోనే తిష్టవేసి... తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. అధికార పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను, జిల్లాల ముఖ్యనేతలను రంగంలోకి దించుతుండగా... ప్రతిపక్ష కాంగ్రెస్, భాజపాలు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను ప్రచారానికి తీసుకువస్తోంది. సిట్టింగ్‌ స్థానం, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్న తెరాస... సర్వశక్తులొడ్డుతూ సత్తాచాటేందుకు యత్నిస్తోంది.

కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నేత జానారెడ్డి బరిలో ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకతతో తమ గెలుపు తథ్యమని హస్తం పార్టీ ధీమాతో ఉంది. మరో ప్రధాన పార్టీ భాజపా.... ఇటీవల వరుస విజయాలతో ఇక్కడ కూడా తమ సత్తాచాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు, రాష్ట్రస్థాయి నేతలతో జోరుగా ప్రచారం సాగిస్తోంది.

జోరుగా ప్రచారం...

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం ఎర్ర చెరువు, నెల్లికల్, జాలు తండాల్లో... తెరాస అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. కాంగ్రెస్‌ నేత జానారెడ్డి హయాంలో నియోజకవర్గానికి చేసిందేమి లేదని... తెరాస పాలనలోనే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనించాయని తెలిపారు. తెరాస అభ్యర్థికి మరోసారి ప్రజలు పట్టం కట్టాలని మంత్రులు కోరారు. గుర్రంపోడు మండలం కొప్పోలు, మొసంగి గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

పెనుమార్పులు...

జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గుర్రంపోడ్‌ మండలంలో జానారెడ్డికి మద్దతుగా పార్టీ నేతలతో కలిసి వారు ప్రచారం నిర్వహించారు. తెరాస నేతలు డబ్బు, మద్యంతో గెలుపొందాలని యత్నిస్తున్నారని వారు ఆరోపించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో జానారెడ్డి తమ సీఎం అభ్యర్థిగా ఒప్పిస్తామని తెలిపారు.

రంగంలోకి కేంద్రమంత్రులు...

భాజపా అభ్యర్థి రవి కుమార్‌ నాయక్‌కు మద్దతుగా కేంద్ర మంత్రులు అర్జున్‌రాం మేఘవాల్, కిషన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. అనుముల మండలం పులిమామిడి, మారేపల్లి, అన్నారంలో కిషన్‌రెడ్డి రోడ్‌షో చేశారు. నిరుద్యోగులను కేసీఆర్ సర్కారు మోసం చేసిందని... కాంగ్రెస్‌, తెరాస సాగర్‌కు చేసిందేమి లేదని విమర్శించారు. సాగర్ ఉపఎన్నికలో భాజపా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘలాల్‌ తెలిపారు. జనరల్‌ స్థానంలో ఎస్టీ అభ్యర్థికి టికెట్‌ ఇచ్చిన ఘనత భాజపాదేనని చెప్పారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. కానీ, ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు నోచుకోవటంలేదు. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అంశాల్లో అడుగడుగునా అవినీతి పేరుకుపోయింది. టీఎస్‌పీఎస్‌సీకి కనీసం ఛైర్మన్‌ కూడా లేని పరిస్థితి. అక్కడున్న సభ్యుడే ఛైర్మన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ కల్పన ఎలా సాధ్యమవుతుంది? జనరల్‌కు కేటాయించిన స్థానంలో ఎస్టీ అభ్యర్థి రవి కుమార్‌ నాయక్‌కు భాజపా టికెట్‌ ఇచ్చింది. మా అభ్యర్థికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఉపఎన్నికలో భాజపా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి.

-- అర్జున్‌రాం మేఘవాల్, కేంద్రమంత్రి

మరోవైపు తెదేపా అభ్యర్థి మువ్వ అరుణ్ కుమార్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన స్వగ్రామమైన అనుముల మండలం చింతగూడెం నుంచి భారీ ప్రదర్శనగా ప్రచారానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, కళాకారులు కోలాటాలు వేస్తూ ప్రదర్శన నిర్వహించారు.

ఇవీచూడండి: నీతి ఆయోగ్ మెచ్చిన టీడీఆర్.. స్థిరాస్తి వ్యాపారుల మొగ్గు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.