ETV Bharat / state

'తెరాస, కాంగ్రెస్​లు ఓటర్లను మభ్యపెట్టే యత్నం చేస్తున్నాయి.!'

author img

By

Published : Apr 10, 2021, 7:04 PM IST

నాగార్జునసాగర్​ ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. భాజపా అభ్యర్థి రవికుమార్​ తరఫున పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రచారం నిర్వహించారు.

dk aruna, sagar by elections
డీకే అరుణ, సాగర్ ఉపఎన్నికలు

కాంగ్రెస్​, తెరాస పాలనలో నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. మాటలతో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. వారి మాటలు నమ్మి ఓటేసి మోసపోవద్దని హితవు పలికారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి రవి కుమార్ తరఫున డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నల్గొండ జిల్లా అనుముల మండలం పులి మామిడి, కే కే కాల్వ, కోసల మర్రి, అన్నారం, వెంకటాద్రి పాలెం, ముక్కామల గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఉన్నత చదువులు చదివిన గిరిజన బిడ్డ రవికుమార్​ నాయక్​ను గెలిపిస్తే అభివృద్ధి భాజపా చూసుకుంటుందని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్​, తెరాస పాలనలో నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. మాటలతో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. వారి మాటలు నమ్మి ఓటేసి మోసపోవద్దని హితవు పలికారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి రవి కుమార్ తరఫున డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నల్గొండ జిల్లా అనుముల మండలం పులి మామిడి, కే కే కాల్వ, కోసల మర్రి, అన్నారం, వెంకటాద్రి పాలెం, ముక్కామల గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఉన్నత చదువులు చదివిన గిరిజన బిడ్డ రవికుమార్​ నాయక్​ను గెలిపిస్తే అభివృద్ధి భాజపా చూసుకుంటుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: 'సాగర్​'లో గెలిపిస్తే నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయం: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.