ETV Bharat / state

తెరాస హయాంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం: ప్రొ.నాగేశ్వర్

author img

By

Published : Dec 27, 2020, 4:50 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలికలో టీఎస్​యూటీఎఫ్ తృతీయ మహాసభలను నిర్వహించారు. విద్యా వ్యవస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆరోపించారు.

tsutf-third-mahasabha-at-kalwakurthy-in-nagar-kurnool-district
తెరాస హయాంలో వ్యవస్థను నిర్లక్ష్యం: ప్రొ.నాగేశ్వర్

విద్యా వ్యవస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. నిరుపేద విద్యార్థులందరికీ విద్యనందించేలా గురుకులాలను ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వివరించారు. పీఆర్సీని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరగా... సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో టీఎస్​యూటీఎఫ్ తృతీయ మహాసభలను నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆరోపించారు. ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థ నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యార్థికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల జీవితం అన్ని రకాలుగా బాగుంటేనే మంచిదని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థలో చాలా మార్పులను చేయాలని సూచించారు.

వెంటనే పీఆర్సీ, ఐఆర్​లను అమలు చేసి, వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపాధ్యాయునికి గౌరవం, తగిన ఆర్థిక వనరులు ఉంటాయని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్​యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, వివిధ జిల్లాలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

విద్యా వ్యవస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. నిరుపేద విద్యార్థులందరికీ విద్యనందించేలా గురుకులాలను ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వివరించారు. పీఆర్సీని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరగా... సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో టీఎస్​యూటీఎఫ్ తృతీయ మహాసభలను నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆరోపించారు. ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థ నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యార్థికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల జీవితం అన్ని రకాలుగా బాగుంటేనే మంచిదని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థలో చాలా మార్పులను చేయాలని సూచించారు.

వెంటనే పీఆర్సీ, ఐఆర్​లను అమలు చేసి, వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపాధ్యాయునికి గౌరవం, తగిన ఆర్థిక వనరులు ఉంటాయని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్​యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, వివిధ జిల్లాలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.