ETV Bharat / state

నిద్రపోతున్న వృద్ధుడిని చంపేసిన పంది - నాగర్ కర్నూలు జిల్లా నంది వడ్డేమాన్ గ్రామంలో ఓ పంది వృద్ధుడిని పొట్టనపెట్టుకుంది

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్‌లో ఓ పంది స్వైర విహారం చేసింది. ఓ వృద్దుడి ఇంట్లోకి ప్రవేశించి నేలపై పడుకున్న అతన్ని తీవ్రంగా గాయపరిచి చంపేసింది.

నిద్రపోతున్న వృద్ధుడిని చంపేసిన పంది
author img

By

Published : Oct 17, 2019, 12:17 PM IST

నాగర్ కర్నూలు జిల్లా నంది వడ్డేమాన్ గ్రామంలో ఓ పంది వృద్ధుడిని పొట్టనపెట్టుకుంది. నడవడానికి కూడా చేతకాని కొండయ్య నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఓ పంది ఇంట్లోకి ప్రవేశించింది. నేలపై పడుకున్న అతనిపై దాడి చేసింది. తల, చేతిని పీక్కుతింది. కొండయ్య అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు వచ్చి పందిని తరిమికొట్టారు. అప్పటికే వృద్ధుడు కొండయ్య తీవ్రరక్తస్రావంతో చనిపోయాడు. కొండయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నిద్రపోతున్న వృద్ధుడిని చంపేసిన పంది

ఈ ఘటనతో పందులంటేనే గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. పందులను పెంచుతున్న వారికి గతంలోనే గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు కూడా ఇచ్చారని చెబుతున్నారు.

ఇదీ చూడండి : తహసీల్దార్ కార్యాలయంలో గుండెపోటుతో రైతు మృతి

నాగర్ కర్నూలు జిల్లా నంది వడ్డేమాన్ గ్రామంలో ఓ పంది వృద్ధుడిని పొట్టనపెట్టుకుంది. నడవడానికి కూడా చేతకాని కొండయ్య నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఓ పంది ఇంట్లోకి ప్రవేశించింది. నేలపై పడుకున్న అతనిపై దాడి చేసింది. తల, చేతిని పీక్కుతింది. కొండయ్య అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు వచ్చి పందిని తరిమికొట్టారు. అప్పటికే వృద్ధుడు కొండయ్య తీవ్రరక్తస్రావంతో చనిపోయాడు. కొండయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నిద్రపోతున్న వృద్ధుడిని చంపేసిన పంది

ఈ ఘటనతో పందులంటేనే గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. పందులను పెంచుతున్న వారికి గతంలోనే గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు కూడా ఇచ్చారని చెబుతున్నారు.

ఇదీ చూడండి : తహసీల్దార్ కార్యాలయంలో గుండెపోటుతో రైతు మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.