నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో యోగా దినోత్సవం నిర్వహించారు. క్రమం తప్పకుండా యోగాసనాలు వేస్తే రోగాలు దరిచేరవని నిపుణులు సూచించారు. పెద్దలకు మానసిక ప్రశాంతత, విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుందని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగా శిక్షకుడు అర్జున్గౌడ్ పలు ఆసనాలు వేసి..వాటి వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు.
ఇవీ చూడండి: కాళేశ్వరం పుణ్యక్షేత్రం దర్శించుకోనున్న "ఫడ్నవిస్"