నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం ఇందిరానగర్లో ముచ్చపోతుల వెంకటయ్య అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. ఐనోల్లో వ్యక్తి దారుణ హత్యకు గురై 24 గంటలు గడవక ముందే జరిగిన ఈ ఉదంతం పట్టణంలో కలకలం రేపుతోంది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బాత్రూమ్లో వేలాడదీశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దారుణానికి ఒడిగట్టింది సమీప బందువులేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఘటనాస్థలికి చేరుకొని మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఇదీ చూడండి : దేశంలో మరో ఆరుగురికి కరోనా