ETV Bharat / state

కేసీఆర్‌ లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు : ఎల్‌.రమణ

author img

By

Published : Dec 24, 2020, 3:11 PM IST

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ హామీలను మర్చిపోయారని తెతెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రమణ విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి.. ఎన్నికలు పూర్తయ్యాక ప్రగతిభవన్‌కు పరిమితమయ్యే ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని దుయ్యబట్టారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలో చేపట్టిన ఒకరోజు నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు.

l.ramana serious on trs government
కేసీఆర్‌ లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు: ఎల్‌.రమణ

నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద బుధవారం ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. తెతెదేపా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ పాల్గొని.. మాట్లాడారు.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ హామీలను మర్చిపోయారని ఎల్‌.రమణ విమర్శించారు. కరోనా కారణంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపకుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల ప్రకటనలు అంటూ హడావిడి మొదలుపెట్టారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఎక్కడాలేని హామీలు ఇచ్చి.. ఎన్నికలు పూర్తయ్యాక ప్రగతి భవన్‌కు పరిమితమయ్యే ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని దుయ్యబట్టారు. ప్రతీ అంశాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని.. భవిష్యత్తులో ప్రజలు తెరాసకు బుద్ధి చెప్పే సమయం వస్తుందన్నారు. నిరుద్యోగులు, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో పనిచేసే అధ్యాపకులు, ఉపాధ్యాయులు నిరుత్సాహపడొద్దని.. వారిని ఆదుకునేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఈటల అధ్యక్షతన నిపుణుల కమిటీ అత్యవసర భేటీ..!

నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద బుధవారం ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. తెతెదేపా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ పాల్గొని.. మాట్లాడారు.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ హామీలను మర్చిపోయారని ఎల్‌.రమణ విమర్శించారు. కరోనా కారణంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపకుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల ప్రకటనలు అంటూ హడావిడి మొదలుపెట్టారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఎక్కడాలేని హామీలు ఇచ్చి.. ఎన్నికలు పూర్తయ్యాక ప్రగతి భవన్‌కు పరిమితమయ్యే ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని దుయ్యబట్టారు. ప్రతీ అంశాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని.. భవిష్యత్తులో ప్రజలు తెరాసకు బుద్ధి చెప్పే సమయం వస్తుందన్నారు. నిరుద్యోగులు, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో పనిచేసే అధ్యాపకులు, ఉపాధ్యాయులు నిరుత్సాహపడొద్దని.. వారిని ఆదుకునేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఈటల అధ్యక్షతన నిపుణుల కమిటీ అత్యవసర భేటీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.