ETV Bharat / state

సమాచార హక్కు చట్టంతో గెలిచిన రైతులు

సమాచార హక్కు చట్టంతో రైతులు గెలిచారు. అవునూ...బీమా సంస్థ నుంచి తమకు రావాల్సిన 18 లక్షల 94 వేలు రూపాయలు రాబట్టుకున్నారు. ఏడేళ్లపాటు పోరాటం చేసి పరిహారం పొందారు నాగర్​కర్నూలు జిల్లా రైతన్నలు.

author img

By

Published : Jun 28, 2019, 12:44 PM IST

శ్రీరామ్ ఆర్యా

నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమానుకు చెందిన 800 మంది రైతులు 2012లో పత్తి, మొక్కజొన్న పంట వేసి ఎకరాకు 400 చొప్పున అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాకు బీమా ప్రీమియం చెల్లించారు. నష్టపోయిన పత్తి పంటకు డబ్బులు వచ్చాయి. మొక్కజొన్న పంట వేసిన అన్నదాతలకు రాలేదు. ఏడాదిపాటు కర్షకులు ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. 2018 జనవరిలో కేంద్ర సమాచార కమిషన్​కు అప్పీలు చేశారు. స్వీకరించిన కేంద్ర సమాచార కమిషన్ బీమా కంపెనీకి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కంపెనీ ముందు చూపుతో నెల రోజుల క్రితమే 800 మంది కర్షకుల ఖాతాల్లో 18 లక్షల 94 వేల నగదు జమా చేసింది. సమాచారం కమిషన్​ నుంచి నోటిసులు రావడం వల్లే రైతులకు నష్టపరిహారం అందజేసిందని న్యాయవాది శ్రీరామ్ ఆర్యా తెలిపారు.

సమాచార హక్కు చట్టంతో గెలిచిన రైతులు

ఇవీ చూడండి: బౌద్ధ గురువు దలైలామా హత్యకు ఉగ్ర కుట్ర

నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమానుకు చెందిన 800 మంది రైతులు 2012లో పత్తి, మొక్కజొన్న పంట వేసి ఎకరాకు 400 చొప్పున అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాకు బీమా ప్రీమియం చెల్లించారు. నష్టపోయిన పత్తి పంటకు డబ్బులు వచ్చాయి. మొక్కజొన్న పంట వేసిన అన్నదాతలకు రాలేదు. ఏడాదిపాటు కర్షకులు ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. 2018 జనవరిలో కేంద్ర సమాచార కమిషన్​కు అప్పీలు చేశారు. స్వీకరించిన కేంద్ర సమాచార కమిషన్ బీమా కంపెనీకి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కంపెనీ ముందు చూపుతో నెల రోజుల క్రితమే 800 మంది కర్షకుల ఖాతాల్లో 18 లక్షల 94 వేల నగదు జమా చేసింది. సమాచారం కమిషన్​ నుంచి నోటిసులు రావడం వల్లే రైతులకు నష్టపరిహారం అందజేసిందని న్యాయవాది శ్రీరామ్ ఆర్యా తెలిపారు.

సమాచార హక్కు చట్టంతో గెలిచిన రైతులు

ఇవీ చూడండి: బౌద్ధ గురువు దలైలామా హత్యకు ఉగ్ర కుట్ర

Intro:TG_MBNR_2_28_SAMACHARA_HAKKU_SUCCESS_AB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
( ) ఏడేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యను సమాచార హక్కు చట్టం ద్వారా వ్యాజ్యం వేసి తమకు రావాల్సిన 18 లక్షల 94 వేల పంట నష్టపరిహారాన్ని సాధించుకున్నారు.. 800 మంది రైతులు.
VOICEOVER:- నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామం లోని ఎనిమిది వందల మంది రైతులు 2012లో పత్తి మొక్కజొన్న పంట వేసిన రైతులు ఎకరాకు 400 చొప్పున అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా కు భీమా ప్రీమియం చెల్లించారు. అయితే నష్టపోయిన పత్తి పంటకు భీమా డబ్బులు వచ్చాయి.మొక్కజొన్న పంట వేసిన రైతులకు బీమా ప్రీమియం రాలేదు. ఏడాదిపాటు రైతులు ఎదురు చూసిన ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో అదే గ్రామానికి చెందిన సమాచార హక్కు చట్టం దరఖాస్తు గారు న్యాయవాది అయిన శ్రీరామ్ ఆర్య సమాచార హక్కు చట్టాన్ని ద్వారా వివరాలు కోరారు. రైతులకు నష్టపరిహారం చెల్లించినట్లు కంపెనీ ప్రతినిధులు సమాధానం ఇచ్చారు. కానీ వాస్తవంగా పంట నష్టపరిహారం రైతులకు అందలేదు. అలా రెండు మూడు సార్లు సమాచార హక్కు చట్టం ద్వారా కంపెనీ వివరాలు కోరగా కంపెనీ నిర్లక్ష్యం వహించింది. 2017 అక్టోబర్ లో మరోసారి దరఖాస్తు చేసిన స్పందించకపోవడంతో 2018 జనవరిలో కేంద్ర సమాచార కమిషన్ కు అప్పీలు చేశారు. స్వీకరించిన కేంద్ర సమాచార కమిషన్ బీమా కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే బీమా కంపెనీ నోటీసులు అందుకున్న కంపెనీ ముందు చూపుతో నెల రోజుల క్రితమే 800 మంది రైతుల ఖాతాల్లో 18 లక్షల 94 వేల రూపాయలని వాళ్ళ ఖాతాలో జమ చేసింది.దీనిపై కేంద్ర సమాచార కమిషన్ సభ్యులు ఢిల్లీ నుంచి సమాచార హక్కు దరఖాస్తుదారుడి తో నిన్న వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ ఆర్యా కమిషన్ విచారణ నేపథ్యంలో నే భీమా కంపెనీ ముందుచూపుతో నెల రోజుల ముందు రైతులకు నష్టపరిహారం అందజేసింది అన్నారు.ఏడేళ్లుగా రైతులకు నష్టపరిహారం అందించకుండా బీమా కంపెనీ నిర్లక్ష్యం చేసిందని మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా భీమా కంపెనీ పై తగు చర్యలు చేపట్టాలని కమీషన్ ను కోరారు. ఈ విషయంపై కమిషన్ సభ్యులు స్పందిస్తూ... కంపెనీకు తాకి తాకీదులు జారీ చేసి ఇ చర్యలు చేపడతామని దరఖాస్తు దారుడికి తెలిపారు. ఏడేళ్లుగా నిర్లక్ష్యం వహించిన కంపెనీపై సమాచార హక్కు చట్టం ద్వారా వేసి రైతులకు పంట బీమా నష్టపరిహారాన్ని అందించానని చాలా ఆనందంగా ఉందని సమాచార హక్కు చట్టం ద్వారా ఎలాంటి పరిష్కారం అయినా సాధించవచ్చని శ్రీరామ్ ఆర్య పేర్కొన్నారు....AB
byte:- సమాచార హక్కుదారుడు న్యాయవాది శ్రీ రామ్ ఆర్య


Body:TG_MBNR_2_28_SAMACHARA_HAKKU_SUCCESS_AB_TS10050


Conclusion:TG_MBNR_2_28_SAMACHARA_HAKKU_SUCCESS_AB_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.