నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట ఎక్సైజ్ సీఐ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 9 వేలు లంచం తీసుకుంటుండగా సీఐ, జూనియర్ అసిస్టెంట్ను అరెస్టు చేశారు. పదరం మండలం మారడుగుకు చెందిన దేశావత్ వెంకట్ రాం నాయక్ గతేడాది నవంబరులో అక్రమంగా మద్యం తరలిస్తూ ఎక్సైజ్ అధికారులకు దొరికాడు. కేసు నమోదు చేసి కారు సీజ్ చేశారు.
వాహనాన్ని విడిపించేందుకు లక్షా 50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఒరిజనల్ ఆర్సీ తీసుకొని 'ఇంటరిమ్ రిలీజ్ ఆర్డర్(మధ్యంతర ఉత్తర్వు)' ఇచ్చారు. వాహనాన్ని రిలీజ్ చేసేందుకు మరో లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించగా... సీఐ శ్రావణ్ కుమార్ను వెంకట్ రాం నాయక్ కలిసి అంత డబ్బు లేదని చెప్పాడు. దీంతో ఆఫీస్కు ప్రింటర్ ఇప్పించాలని సూచించగా... 9 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు.
వెంకట్ రాం నాయక్ ఏసీబీని ఆశ్రయించాడు. సీఐ ఆదేశాల మేరకు ఎక్సైజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ దేవేందర్కు లంచం ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాచుకొని ఉన్న అనిశా అధికారులు వల పన్ని సీఐ, జూనియర్ అసిస్టెంట్ను అరెస్టు చేశారు. నిందితులను హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు అనిశా అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: రేవంత్రెడ్డికి 14 రోజుల రిమాండ్