తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వారధిగా ఉన్న మార్గానికి జాతీయ రహదారి హోదా రానుంది. కల్వకుర్తి-నాగర్కర్నూల్-కొల్లాపూర్ (తెలంగాణ) నుంచి ఆత్మకూర్-నంద్యాల (ఆంధ్రప్రదేశ్)కు వెళ్లే మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించే దస్త్రంపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం సంతకం చేసినట్లు రహదారులు, భవనాల శాఖకు సమాచారం అందింది.
మౌఖికంగా తమకు సమాచారం అందిందని, త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ అవుతాయని రహదారులు, భవనాల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ ఐ.గణపతిరెడ్డి ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు చెప్పారు. 170 కిలోమీటర్లు ఉన్న ఆ మార్గాన్ని భారతమాల పథకం కింద విస్తరించేందుకు కేంద్రం ముందుకురావడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణానదిపై సోమశిల వద్ద అతిపెద్ద అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి కూడా మార్గం సుగమమైంది.
ఇవీ చూడండి: వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: ఉత్తమ్