నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆరోగ్య విషయాలు, గర్భిణులు, చిన్నపిల్లలకు అవగాహన కల్పిస్తున్న తమకు రూ. పది వేల వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
గ్రామాల్లో మహిళలకు ఏ సమస్య వచ్చినా ఆశా కార్యకర్తలు ముందుండి పని చేస్తున్నా... వారికి గౌరవ వేతనం ఇవ్వట్లేదని సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు శివవర్మ ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్